మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ రంగం నుండి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మూడు సినిమాలు చేశారు. మొదటి..రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయినా గాని మూడో సినిమా “ఆచార్య” టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయ్యింది. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య.. అభిమానులను భారీగా నిరాశపరిచింది. ఇండస్ట్రీలో అప్పటివరకు ఒక్క ఫ్లాప్ లేని దర్శకుడుగా మంచి ట్రాక్ రికార్డు ఉన్న కొరటాల.. ఆచార్యతో మొదటి ఫ్లాప్ అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి చాలావరకు సీనియర్ దర్శకులతోనే పనిచేస్తున్నారు.
డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్, మెహర్ రమేష్ దర్శకత్వంలో బోలా శంకర్, బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఇకనుండి కొత్త దర్శకులతో ముఖ్యంగా కుర్ర దర్శకులతో పని చేయాలని చిరంజీవి డిసైడ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల చిరంజీవి తెలుగు దర్శకులపై కాంట్రవర్సీ కామెంట్లు చేయడం తెలిసిందే. సినిమా హీరోలు సెట్స్ లోకి వచ్చాక ఆన్ లొకేషన్ లో… కొద్ది నిమిషాలు ముందు డైలాగుల పేపరుస్తున్నట్లు దానివల్ల.. హీరోలు అనేక ఇబ్బందులు పడుతున్నట్లు కామెంట్లు చేశారు.
దీంతో చిరంజీవి ఇండస్ట్రీలో సీనియర్ దర్శకులతో కంటే కుర దర్శకులతో పనిచేయాలని.. తాజాగా డిసైడ్ అయినట్లు సమాచారం. అంత మాత్రమే కాదు కొత్త టాలెంట్ తో పాటు సరికొత్త కాన్సెప్ట్ లతో కొత్త దర్శకులు సినిమాలు చేస్తూ ఉండటంతో చిరంజీవి వాళ్లకి లైఫ్ ఇవ్వటం మాత్రమే కాదు ప్రోత్సహించినట్లు ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒక్క సినిమాలు మాత్రమే కాదు వెబ్ సిరీస్ లు చేయడానికి చిరంజీవి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.