Prabhas Yaash: “కేజిఎఫ్”(KGF) రెండు భాగాలతో హీరో యాష్ కి దేశవ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇటువంటి తరుణంలో “కేజిఎఫ్” సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) ప్రస్తుతం ప్రభాస్(Prabhas) హీరోగా “సలార్”(Salaar) అనే సినిమా చేస్తున్నారు. “కేజిఎఫ్” సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ నీ షేక్ చేయడంతో .. సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడంతో… “సలార్” పై అంచనా భీబత్సంగా నెలకొన్నాయి. హై వోల్టేజ్ యాక్షన్ మూవీ గా తరికేకుతున్నా ఈ సినిమాలో.. శృతిహాసన్(Shruti Hassan) హీరోయిన్ గా నటిస్తోంది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో(Hyderabad) జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ మరియు శృతిహాసన్ యాక్షన్ సన్నివేశాలలో పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో కేజిఎఫ్ హీరో యాష్ కూడా నటించనున్నట్లు లేటెస్ట్ వార్త ఒకటి ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. స్టోరీ పరంగా “సలార్” మరియు “కేజిఎఫ్” కి లింక్ పెట్టే రీతిలో… ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసినట్లు…టాక్. దీంతో సినిమాలో కీలకమైన సమయంలో హీరో యాష్ ఎంట్రీ ఉండనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే “బాహుబలి 2″(Bahubali 2) వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాదేశ్యం రెండు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడటం జరిగింది. పైగా పాన్ ఇండియా సూపర్ స్టార్ అనే ట్యాగ్ లైన్ వచ్చాక. ఇటువంటి తరుణంలో ప్రభాస్.. “సలార్” సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో ఇండియన్ బాక్సాఫీస్ కి తెలియజేయాలని అనుకుంటున్నారట. “సలార్” వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కానుంది. అభిమానులకి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.