బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ సూసైడ్ కేసును సిబిఐ, ఈడి, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణ సంస్థలు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విచారణ వేగవంతం గా జరుగుతున్న తరుణంలో కేసుకు సంబంధించి బయటపడుతున్న విషయాలు సంచలనంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఈ కేసులో డ్రగ్స్ కోణం ఉండటంతో ఎన్సీబి అధికారులు రంగంలోకి దిగి ఇప్పటికే రియా చక్రవర్తి జైలుకు పంపించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా విచారణలో రియా చక్రవర్తి ఇండస్ట్రీ లో ఎవరు డ్రగ్స్ తీసుకుంటున్నారు వంటి విషయాలుకు సంబంధించి కొన్ని పేర్లను బయటపెట్టినట్లు ఇటీవల ఓ ప్రముఖ జాతీయ టెలివిజన్ చానల్ ఆధారాలతో సహా బయట పెట్టింది.
సుశాంత్ ఫామ్ హౌస్ పాన్వెల్ లో ఓ లేక్ లో డ్రగ్స్ పార్టీలు జరిగేవి అని మేనేజర్ రజత్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా పాన్వేల్ బోట్ వర్కర్ మరిన్ని సంచలన విజయాలు ఆఖరి నిమిషంలో టాప్ సీక్రెట్ తరహాలో కొన్ని సంచలనాత్మకమైన పేర్లు బయట పెట్టారు. బయటకు వచ్చిన సమాచారం మేరకు ఈ పేర్లలో ప్రభాస్ తో “సాహో” సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రద్ధ కపూర్ పేరు బయటకు వచ్చిందని జాతీయ మీడియాలో వస్తున్న టాక్. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఎన్సిబి దగ్గర ఉన్నట్లు టాక్.
కాగా వర్కర్ చెప్పిన దాని ప్రకారం “చిచోరే” సినిమా విజయం సాధించిన సమయంలో సారా అలీ ఖాన్, శ్రద్ధాకపూర్, రియా చక్రవర్తి అదేవిధంగా సుశాంత్ కలిసి లేక్ లో బోట్ షికారు చేస్తూ ఆల్కహాల్, మరీజువానా లాంటి డ్రగ్స్ తీసుకున్నారని వెల్లడించారు. అదేవిధంగా ఇండియాటుడే చేసిన పరిశోధనలో కూడా పలు విషయాలు బయట పడినట్లు దీనిలో కూడా శ్రద్ధాకపూర్ పేరు వచ్చినట్లు సమాచారం. కాగా డ్రగ్స్ తీసుకున్న వారిలో శ్రద్ధాకపూర్ పేరు ఇప్పుడు తాజాగా బయటపడటంతో ఈ వార్త బాలీవుడ్ వర్గాల్లో పాటు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఒక్క శ్రద్ధా కపూర్ పేరు మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంకా చాలా మంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. దీంతో మిగతా వారిలో టెన్షన్ మొదలైనట్లు సమాచారం.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!