SVP: “సర్కారు వారి పాట” మరికొద్ది గంటల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలలో మహేష్ చురుగ్గా పాల్గొంటూ వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇంటర్వ్యూ లలో అనేక విషయాలు మహేష్ తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా సినిమా టికెట్ ధరలకు సంబంధించి అప్పట్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ నీ కలవడం ఆ సందర్భం గురించి మంచి ఆసక్తికరమైన విషయాలు తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. జగన్ గురించి మహేష్.. మాట్లాడుతూ..” నేను సీఎం జగన్ ను ఇటీవల కలిసా. ఇంతకుముందు ఫోన్ లో మాట్లాడినప్పటికీ అదే నా ఫస్ట్ మీటింగ్. ఆయన చాలా సింపుల్.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అంత సింపుల్ గా ఉండటం చూసి ఆశ్చర్యపోయా. ఇండస్ట్రీకి మంచి విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఎదుటి వారు చెప్పేది శ్రద్ధగా వింటారు. వ్యక్తులకు గౌరవం ఇస్తారు. ఆయనతో గడిపిన సమయం గుర్తుండిపోతుంది అని మహేష్ సరి కొత్త విషయాలు.. వైయస్ జగన్ గురించి తాజా ఇంటర్వ్యూ తెలియజేశారు. అప్పట్లో సినిమా టికెట్ ధరలకు సంబంధించి చిరంజీవి ఆధ్వర్యంలో… మహేష్, ప్రభాస్, కొరటాల శివ, ఆర్ నారాయణ మూర్తి రాజమౌళి మరి కొంతమంది సినీ ప్రముఖులు వైయస్ జగన్ ని కలవడం జరిగింది.
ఆ సందర్భాన్ని గురించి తాజాగా మహేష్ విధిగా జగన్ ని పొగుడుతూ మాట్లాడటం సంచలనంగా మారింది. ఇదే సమయంలో “సర్కారు వారి పాట”లో 2019 ఎన్నికల టైంలో వైఎస్ జగన్ “నేను విన్నాను నేను ఉన్నాను”.. ఇదే స్లోగన్ “సర్కారు వారి పాట”లో మహేష్..చేపటం ట్రైలర్ లో హైలెట్ గా నిలిచింది. ఈ క్రమంలో ఇంటర్వ్యూలో మరింతగా వైఎస్ జగన్ గురించి మహేష్ బాబు తో పాజిటివ్ కామెంట్లు చేయడం.. సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సర్కారు వారి పాట సినిమాకి సంబంధించి టికెట్ ధరలు పెంచుకునే రీతిలో ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మహేష్ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో అభిమానులు.. ఫుల్ హ్యాపీగా ఉన్నారు.