SVP: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన “సర్కారు వారి పాట” సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మే 12వ తారీకు విడుదలైన ఈ సినిమా.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కలెక్షన్ లతో దూసుకుపోతుంది. పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ పలికిన పంచ్ డైలాగులు… సినిమా చూసే ప్రేక్షకులను ఎంతగానో కడుపుబ్బా నవ్వించేటట్లు చేశాయి. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ హీరో- హీరోయిన్ మధ్య రొమాంటిక్ కామెడీ ట్రాక్ కి ఫ్యామిలీతో పాటు మిగతా ఆడియన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమా విజయం సాధించడంతో ఇప్పటికే కర్నూల్ జిల్లాలో సక్సెస్ మీట్ భారీ ఎత్తున సినిమా సక్సెస్ మీట్ నిర్వహించడం తెలిసిందే. అయితే ఆ కార్యక్రమానికి హీరోయిన్ కీర్తిసురేష్ హాజరు కాలేదు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ క్రమంలో తాజాగా డైరెక్టర్ పరుశురాంతో పాటు మహేష్, కీర్తి సురేష్ … అభిమానులకు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా అభిమానులు వారి ముగ్గురిని ప్రశ్నలు అడగడం జరిగింది. దీనిలో భాగంగా సినిమాలో మహేష్ బాబు పర్సు కీర్తి సురేష్ కొట్టేయడం… దాని గురించి ప్రశ్నిస్తూ నిజ జీవితంలో మీరు ఎవరు పరసు కొట్టేసిన సందర్భం ఉందా అని ప్రశ్నించారు. దానికి పక్కనే ఉన్న మహేష్ ఏం ప్రశ్న అయ్యా.. ఎందుకు పర్సులు కొట్టేస్తారు.. అని బదిలు ఇయ్యగా…పక్కనే ఉన్న కీర్తి సురేష్ మాత్రం నేను చిన్న నాటి సమయంలో..మా నాన్న గారి పాకెట్ పర్సు లో మనీ కొట్టేయడం జరిగింది.. ఇటువంటివి చాలా సార్లు చేశాను అంటూ కీర్తిసురేష్ సమాధానం ఇవ్వడంతో మహేష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
ఈ జవాబు తో.. మిగతా అభిమానులు నవ్వులు చిందించారు. అదే సమయంలో అప్పట్లో కృష్ణ గారి అభిమాని ఒక పెద్దావిడ కూడా.. ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. ఈ సందర్భంగా మహేష్ చిన్నపిల్లల గుండె ఆపరేషన్ కార్యక్రమాలు చేయడాన్ని ఆమె ప్రశంసించారు. మా చిన్నతనంలో కృష్ణ గారు సంవత్సరానికి నాలుగు సినిమాలు చేసేవారు. మీరు కూడా అలా చేస్తే బాగుంటుంది అని చెప్పడంతో.. మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలోనే నాన్నగారు ఎప్పుడూ నన్ను మందలిస్తారు. కానీ కానీ రాబోయే రోజుల్లో ఒప్పో సినిమాలు చేయడానికి ట్రై చేస్తాను అంటూ మహేష్ కొత్త విషయాన్ని తెలిపారు.