Nagababu – chiranjeevi : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంత క్రేజ్ సంపాదించుకున్న మెగా హీరో చిరంజీవి ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించడమే కాకుండా పలు అవార్డులను సైతం దక్కించుకున్న సంగతి మనకు తెలిసినదే. చిరంజీవి ఎన్ని అవార్డులు సొంతం చేసుకున్న నాగబాబు కోరిక మాత్రం నెరవేరలేదంటూ తాజాగా నాగబాబు తన అన్నయ్య విషయంలో ఉన్న కోరికను బయటపెట్టారు. చిరంజీవి తన 42 సంవత్సరాల సినిమా జీవితంలో సైరా నరసింహారెడ్డి సినిమా ద్వారా చారిత్రాత్మక పాత్రను పోషించారు.
సైరా నరసింహారెడ్డి చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందింది. చిరంజీవి ఇప్పటి వరకు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నుంచి నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులను ఎన్నో అందుకున్నారు.కానీ చిరంజీవి ఎన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఒక్కసారి కూడా జాతీయస్థాయిలో అవార్డులను అందుకోలేదని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే 2019 వ సంవత్సరంలో చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం ద్వారా చిరంజీవి జాతీయ ఉత్తమ నటుడి అవార్డును దక్కించుకోవాలని నాగబాబు పలు సందర్భాలలో తన అన్నయ్య పై ఉన్న కోరికను బయటపెట్టారు.
జాతీయ చలనచిత్ర పురస్కారాలు:
తాజాగా జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్న సినిమాల జాబితా ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగులో జాతీయ ఉత్తమ నటుడిగా చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని, బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాలను జ్యూరీ పరిశీలనకు పంపారు. అయితే ఈ రెండు చిత్రాలు ఉత్తమ నటుడి విభాగంలో ఫైనల్ కీ చేరకపోవడంతో తీవ్ర నిరాశే ఎదురైంది. వివిధ భాషలలో పలు చిత్రాలతో ఎంతో పోటీగా ఉన్న ఈ పురస్కారాలలో ఫైనల్గా జ్యూరీ ధనుశ్తో పాటు మనోజ్ వాజ్పేయ్కి సంయుక్తంగా జాతీయ అవార్డు ప్రకటించాయి. మొత్తంగా సైరానరసింహారెడ్డి సినిమా ద్వారా తన అన్నయ్య ఉత్తమ జాతీయ నటుడు అవార్డు అందుకోవాలనే నాగబాబు కోరిక అలాగే మిగిలిపోయిందనీ చెప్పవచ్చు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!