Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీలో ఏ గాడ్ ఫాదర్ లేకున్న.. స్వయంకృషితో మెగాస్టార్ గా నిలిచారు. ఈ ప్రయాణంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని.. టాలెంట్ ను నమ్ముకుని.. చాలామంది దర్శక నిర్మాతల దృష్టిలో పడి.. ఇండస్ట్రీ ని శాసించే స్థాయికి చిరంజీవి రావడం జరిగింది. అయితే కెరీర్ పరంగా స్టార్టింగ్ లో బ్యాక్ టు బ్యాక్ చిరంజీవి వరుస విజయాలతో దూసుకుపోతున్న సమయంలో.. ఆయన విజయ ప్రయాణాన్ని కొందరు ఓర్వలేక చిరంజీవిని చంపే ప్రయత్నం చేయడం జరిగిందట. అయితే అది నేరుగా కత్తులతో మారే రకమైన దాడులు కాకుండా విషప్రయోగం చిరంజీవిపై అప్పట్లో చేసినట్లు ఓ వార్త ఇటీవల బయటపడింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
విషయంలోకి వెళితే “మరణమృదంగం” సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో… చిరంజీవిపై విషప్రయోగం జరిగిందంట. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలో కొంతమంది అభిమానులు వచ్చినట్లు.. అభిమానుల్లో ఒకరి పుట్టినరోజు అని.. షూటింగ్ చేస్తున్న చిరంజీవిని ప్రత్యేకంగా పక్కకు తీసుకెళ్లి.. కేక్ కటింగ్ ప్రోగ్రాం ఉందని తెలిపారట. అయితే కేవలం అభివాదం చేసి షూటింగ్ వెళ్ళిపోదాం అని అనుకొన్న చిరంజీవి కేక్ కటింగ్ అనే పార్టీకి పైగా ఫ్యాన్స్ అనేప్పటికీ… కాదనలేక కేక్ కట్ చేయడం జరిగిందట. అయితే ఈ క్రమంలో కేక్ కట్ చేసిన అభిమాని.. ఒక కేక్ ముక ను చిరంజీవికి తినిపించాలని ప్రయత్నం.. చేయడం జరిగిందట. అప్పటికే చిరంజీవి తాను తినను అని.. నిర్మొహమాటంగా చెప్పినా గానీ బలవంతంగా.. చిరంజీవి నోట్లో పెట్టే ప్రయత్నం చేస్తున్న సమయంలో తోపులాట జరగడంతో కేకు మొత్తం కింద పడిపోయింది అంట.
అయితే కేక్ మధ్యలో రంగు అధికంగా ఉండే సరికి.. చిరంజీవి కి అనుమానం వచ్చి నోరు మొత్తం.. శుభ్రం చేసుకుంటే ప్రజలు మొత్తం నీలం రంగులోకి మారిపోయాక. వెంటనే సినిమా అసిస్టెంట్..నీ పిలిచి లిప్ కి లిప్ స్టిక్ వేయాలని.. అంటే అప్పటికే రంగు ఇంకా మారుతూ ఉండటంతో వెంటనే అసిస్టెంట్ దర్శక నిర్మాతలకు.. విషయం మొత్తం చెప్పడంతో వెంటనే చిరంజీవిని హాస్పిటల్ లో జాయిన్ చేయడం జరిగింది. ఈ క్రమంలో తన పై విషప్రయోగం జరిగిందని వైద్యులు మెగాస్టార్ చిరంజీవికి తెలియజేయ గానే… ఒక్కసారిగా షాక్ అయ్యారట. దీంతో ఆ రోజంతా హాస్పిటల్ లోనే ఉండి విషం మొత్తం.. బాడీ మొత్తానికి ఎక్కకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడట. మెగాస్టార్ చిరంజీవి ఆ సమయంలో తెలివిగా ప్రవర్తించటంతో.. ఆ ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. అప్పట్లో ఈ వార్త పేపర్ లో కూడా పడింది. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో రావటంతో వైరల్ అవుతుంది.