Waltair Veerayya: “వాల్తేరు వీరయ్య” ప్రీ రిలీజ్ వేడుక విశాఖపట్నంలో జరిగిన సంగతి తెలిసిందే. ఆదివారం విశాఖపట్నం ఏయూ కాలేజ్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబి, రవితేజ, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు, కోనా వెంకట్ సినిమాకి సంబంధించి మరి కొంతమంది నటీనటులు పాల్గొనడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి మెయిన్ హీరోయిన్ శృతిహాసన్ రాలేదు. ఈ కార్యక్రమానికి రాకముందే ఇంస్టాగ్రామ్ లో తనకి అనారోగ్యం ఉందని, అందుకే వైజాగ్ ఈవెంట్ మిస్ అవుతున్నట్లు తెలిపింది.
ఇదే సమయంలో చిరంజీవి లాంటి లెజెండరీ నటుడితో నటించడం అదృష్టంగా భావిస్తున్నట్లు.. సంజాయిషీ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి తన స్పీచ్ లో హీరోయిన్ శృతిహాసన్ ఈ కార్యక్రమానికి రాకపోవటం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఆ అమ్మాయి ఒంగోలులో ఏమితుందో.. ఏంటో తెలీదు. జ్వరం వచ్చిందట. ఎవరు బెదిరించారో… తెలీదు పాపం. ఇవాళ ఫోన్ చేసి ఒంట్లో నలతగా ఉందని చెప్పింది. కరోనా టెస్ట్ కూడా చేయించాను అంది. సో కార్యక్రమానికి రాలేకపోతున్నట్లు సారీ తెలియజేసింది. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో కరోనా సోకకుండా ఉండాలని అన్నారు.
సరిగ్గా ఈ కార్యక్రమానికి రెండు రోజులు ముందు ఒంగోలులో బాలకృష్ణ నటించిన “వీరసింహారెడ్డి” ప్రీ రిలీజ్ వేడుకకి వెళ్లడం జరిగింది. ఆ సినిమాలో కూడా శృతిహాసన్ మెయిన్ హీరోయిన్. ఈ రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం. ఇదే సమయంలో సంక్రాంతి బరిలో ఒక్కరోజు వ్యవధిలో రిలీజ్ అయ్యి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద “వీరసింహారెడ్డి”, “వాల్తేరు వీరయ్య” పోటీ పడుతున్నాయి. మరి సంక్రాంతి పండుగకు ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి. ఇప్పటివరకు దాదాపు పదికి పైనే సంక్రాంతి పండుగకు బాలకృష్ణ చిరంజీవి సినిమాలు రిలీజ్ అయ్యాయి. చాలాసార్లు బాలకృష్ణ పై చేయి సాధించారు.