Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తిరుగులేని క్రేజ్ తో దూసుకుపోతూ ఉన్నాడు. మెగా ఫ్యామిలీ హీరోగా ప్రారంభంలో ముద్రపడినా గాని తరువాత తనకంటూ సెపరేట్ మేజిక్ క్రియేట్ చేసుకుని అన్ని రకాల పాత్రలు చేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకుల అభిమానాన్ని అందుకుంటూ సౌత్ ఇండియా ఇంకా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాడు. ముఖ్యంగా గత ఏడాది “పుష్ప” సినిమాతో బన్నీ ఇమేజ్ ప్రపంచ స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ టైం పాన్ ఇండియా నేపథ్యంలో బన్నీ నటించిన “పుష్ప” అనేక రికార్డులను క్రియేట్ చేసింది.
“పుష్ప”లో బన్నీ పలికిన తగ్గేదేలే.. డైలాగులు ..ఇంకా పాటలు స్టెప్ లు అన్ని దేశాల ప్రజలను అలరించడం జరిగింది. చాలామంది ప్రముఖులను.. రాజకీయ నాయకులను అదేవిధంగా ఇంటర్నేషనల్ క్రీడాకారులను పుష్ప ఎంతో ప్రభావితం చేసింది. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి ఫిలింఫేర్ అవార్డుల్లో అనేక అవార్డులు రావడం జరిగాయి. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా సౌత్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీలో ఏ హీరోకి రాణి ఓ అవార్డు “పుష్ప”కి సంబంధించి అల్లు అర్జున్ అందుకున్నారు.
పూర్తి విషయంలోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం “ఇండియన్ ఆఫ్ ది ఇయర్” గా అల్లు అర్జున్ కి అవార్డు ఇవ్వటం జరిగింది. ఇటీవల ఢిల్లీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా బన్నీ ఈ అవార్డు అందుకోవడం జరిగింది. ఫస్ట్ టైం సౌత్ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన హీరోగా ఈ అవార్డు అందుకుని పనిని సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. దీంతో బన్నీ ఫాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. మరోపక్క ఈనెల 20వ తారీకు నుండి పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ స్టార్ట్ చేయటానికి సినిమా యూనిట్ రెడీ అయింది.