ప్రముఖ సాహితీ వేత్త, కవి ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ(75) గురువారం ఉదయం నాలుగు గంటలకు హైదరాబాద్లో తుది శ్వాస విడిచారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో ఇంద్రగంటి శర్మ మే 29, 1944లో జన్మించారు. ఆకాశవాణిలో అసిస్టెంట్ ఎడిటర్గా పనిచేసి కేంద్రానికి విశేష సేవలందించారు. కవితలు, వ్యాసాలతోపాటు రేడియో నాటికలు, డాక్యుమెంటరీలు, సంగీత రూపకాలను రచించారు. కృష్ణావతారం, నెలవంక, రావు-గోపాలరావు తదితర చిత్రాలకు పనిచేశారు. ఇటీవల కాలంలో ఈయన తనయుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన `సమ్మోహనం` సినిమాలో పాటను రచించారు. ఆయన లేని లోటు సాహితీ లోకానికి తీరనిలోటు అంటూ పలువురు సంతాపాన్ని వ్యక్తం చేశారు.
previous post
next post