Acharya: మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన తాజా చిత్రం `ఆచార్య`. ప్రముఖ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, అవినాష్ రెడ్డి నిర్మించారు. ఇందులో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు.
అలాగే విలన్ పాత్రను సోనూసూద్ పోషించగా.. మణిశర్మ స్వరాలు అందించారు. గత ఏడాడే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదల అయ్యేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. అయితే ఇలాంటి తరుణంలో ఓ షాకింగ్ వార్త నెట్టింట వైరల్గా మారింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అదేంటంటే.. ఈ సినిమాలో కొరటాల శివ కాజల్ అగర్వాల్ సీన్స్ను లేపేశారట. వాస్తవానికి ఆచార్యలో చిరుకు జోడీగా కాజల్ నటించింది. గత ఏడాది ఆరంభంలో షూటింగ్లో కూడా పాల్గొంది. కానీ, ఆమె ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయిన కొద్ది రోజులకు కరోనా వచ్చింది. మళ్లీ ఈ సినిమా షూటింగ్ రీ స్టార్ట్ అయ్యే సమయానికి కాజల్ ప్రెగ్నెంట్ అని తెలిసింది.
దాంతో కాజల్ ను బ్యాలెన్స్ పార్ట్ కంప్లీట్ చేయమని నిర్మాతలు అడగగా… ప్రెగ్నెన్సీ కారణంగా రానని చెప్పేసింది. దాంతో కొరటాల ఆమె పాత్ర కోసం రాసుకున్న చాలా సీన్స్ను తొలగించారట. అందువల్ల, ఆచార్యలో కాజల్ పెద్దగా కనిపించదని.. ఆమె పాత్ర నడివి పూజా హెగ్డే రోల్ కంటే తక్కువగా ఉంటుందని ఇప్పుడు జోరుగా టాక్ నడుస్తోంది. ఈ ప్రచారమే నిజమైతే ఆచార్యపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాజల్ ఫ్యాన్స్కు ఊహించని షాక్ తగిలినట్టు అవుతుంది.