NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఇదివరకెప్పుడూ ఎన్టీఆర్ ఇలాంటి దీక్షలు తీసుకోలేదు. కానీ, `ఆర్ఆర్ఆర్` విడుదలైన వెంటనే ఆయన కాషాయ వస్త్రాలు ధరించి మాలలో దర్శనమిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
అయితే ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష చేపట్టడం వెనక రాజమౌళినే కారణమని ప్రస్తుతం ఓ వార్త నెట్టింట జోరుగా వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన మల్టీస్టారర్ చిత్రం `ఆర్ఆర్ఆర్` బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ మూవీతో ఎన్టీఆర్ తొలిసారి పాన్ ఇండియా ప్రేక్షకులను పలకరించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అలాగే తన తదుపరి చిత్రాలను కూడా పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తున్నారు. అయితే రాజమౌళి దర్శకత్వంలో నటించిన హీరోల తర్వాత సినిమాలు ఫ్లాప్ అవుతాయన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఈ బ్యాడ్ సెంటిమెంట్ను ఇప్పటి వరకు ఆయనతో పని చేసిన ఈ హీరో కూడా బ్రేక్ చేయలేకపోయారు. ఇక ఈ బ్యాడ్ సెంటిమెంట్ నుంచి తప్పించుకోవడం కోసమే ఎన్టీఆర్ తన ఇష్ట దైవమైన ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్నారని టాక్ నడుస్తోంది.
మరి ఇందులో ఎంత వరకు నిజమో ఆయనకే తెలియాలి. కాగా, ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివతో ప్రకటించాడు. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్తో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ మూవీని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ కలిసి హై బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.