Adipurush: ప్రస్తుతం ప్రభాస్ టాలీవుడ్ రేంజ్ నుంచి పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న నాలుగు సినిమాలు కూడా పాన్ ఇండియా తరహాలోనే తెరకెక్కుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రభాస్ కి అభిమానులు ఉండటంతో నిర్మాతలు సైతం అత్యంత బడ్జెట్ తో ప్రభాస్ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో “ఆదిపురుష్” సినిమాకోసం దేశం మొత్తం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు దర్శకత్వం బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా ముంబైలో ఓ ఫ్లాట్ కొన్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ సినిమా నుంచి తాజా అప్డేట్ రావడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచుతోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా గ్రీన్ మ్యాట్ లోనే జరగబోతుందని తెలుస్తోంది. అవుట్ డోర్ షూటింగ్ లకు తక్కువగా వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్ మొత్తం గ్రీన్ మ్యాట్ లోనే జరగడంతో ఈ సినిమా విజువల్ వండర్ గా ఉండబోతోందని తెలుస్తోంది.
సీత పాత్రలో కృతి సనన్ :
రామాయణం కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించగా కృతిసనన్ సీత పాత్రలో చేయనున్నారు. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ లో భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉండే పాటను చిత్రీకరించబోతున్నాడు దర్శకుడు. వీలైనంత వరకు ఈ సినిమా చిత్రీకరణ 2021లో పూర్తి చేస్తే వచ్చే ఏడాదికి ఈ సినిమాను విడుదల చేయడానికి వీలు ఉంటుందన్న ఉద్దేశంతో శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది. ప్రభాస్ ఈ సినిమా కోసమే నాలుగు వందల కోట్ల బడ్జెట్ కేటాయించగా ఇందులో 60 శాతం గ్రాఫిక్స్ కోసమే ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియాలో ఇది వరకు చూడని బారీ విజువల్స్ చిత్రంగా ఓం రౌత్ ఆదిపురుష్ సినిమాను చూపించబోతున్నట్లు సమాచారం.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!