Intinti Gruhalakshmi: లాస్య ఎప్పుడెప్పుడు ఇంట్లో గొడవ పెడదామా అని ఎదురుచూస్తుంది.. అందుకు అంకితకు గాలం వేసే ప్రయత్నం చేస్తుంది.. మొత్తానికి అంకిత తన కాలంలో చిక్కుకొందా లేదా..!? నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..!!
అంకిత లాస్య ఒకేసారి ఆఫీస్ నుంచి ఇంట్లోకి వస్తుండగా.. అంకిత ను వాళ్ళ నానమ్మ ఇప్పుడైనా ఆఫీస్ నుంచి వస్తుంది అని ప్రేమగా పలకరిస్తోంది.. నన్ను కూడా అలా ప్రేమగా పలకరించి వచ్చు కదా అని లాస్య ముఖం చిట్లించుకుంటుంది.. మీ తాతయ్యకు టిఫిన్ తినే టైం అయింది తులసి ఇంకా రాలేదు నువ్వు చేస్తావా అని అడుగుతుంది. సరే అని చెప్పగానే .. చపాతీలు చాలా మెత్తగా చెయ్యి మీ తాతయ్యకు అసలే గ్యాస్ కూడా ఉంది త్వరగా చేసి తీసుకొని రమ్మని చెబుతుంది.. అంకిత నానా తంటాలు పడి చపాతీలు చేసి తీసుకొస్తుంది అవి మాడిపోయాయని.. అనుకుంటుండగా.. మంచివి వెతికి వాళ్ళ తాత నానమ్మ పెడుతుంది అంకిత. అవి తింటూనే ఉప్పు గా ఉన్నాయి. ఎంత ఉప్పు వేసావ్ ఏంటి అసలే నాకు బిపి ఎక్కువ అని నాలుగు చివాట్లు పెడుతుంది వాళ్ళ నానమ్మ.. ఇక అదే కోపంతో అనసూయ కోపంగా టీ పెట్టుకొని రమ్మని చెబుతుంది.
Read More: Devatha Serial: రాధను పిల్లులు భలే లాక్ చేశారే..! ఆదిత్య ను పిల్లల విషయంలో ఇరకాటంలో పెట్టిన సత్య..!
ఇక అంకిత తీసుకొచ్చే ఇవ్వగా టీ చెత్తలా ఉన్నాయని.. సరిగ్గా టీ కాయలేదని.. టేస్ట్ లేదని.. తులసిల చేయలేదని.. నానా మాటలు అంటుంది.. ఇక తనకు వచ్చే కోపాన్ని తట్టుకోలేక అంకిత వాళ్ళ నానమ్మ పై అరుస్తుంది. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. నాకు అసలే వంటలు చేయడం రాదు. పైగా నేర్చుకుని ఎలాగోలా చేస్తున్నాను. మీరు మేచ్చుకొకపోగా ఇలా తిడుతున్నారు ఏంటి.. ఆంటీ ఒక్కరైనా ఉద్యోగం చేసేది.. మేము చేయడం లేదా.. ఎప్పుడు తులసి ఆంటీ తో కంపారిజన్ చేస్తారు ఏంటి..!? తులసి ఆంటీ వేరు మేము వేరు కనీసం మాకు గుర్తింపు కూడా ఇవ్వరా అంటూ అంకిత రివర్స్ అవుతుంది. అంతలో తులసి వస్తుంది. అంకిత పెద్ద వాళ్ళతో మాట్లాడే పద్ధతి ఇదేనా అని అరుస్తుంది. ఇక లాస్య ఆ మంట కి ఆజ్యం పోగా తులసి వారిస్తుంది. ఇంట్లో జరిగే గొడవలు అన్నింటికి మూల కారణం నువ్వేనని చెప్పి లాస్య అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
ఇక ఈ మంట ఆగిపోకూడదు అని దీనికి ఎలాగైనా ఆజ్యం పోయాలని.. ఎవరిని రంగంలోకి దింపాలని లాస్య ఆలోచిస్తూ ఉంటుంది. గాయత్రి అయితే సరైన సమాధానం చెబుతుందని.. ఆంకితకు ఫేవర్ గా మాట్లాడాతు గాయత్రి కి జరిగిన విషయాన్ని తులసి నెగిటివ్ గా కనిపించే ఈ విధంగా చెబుతుంది.. లాస్య చెప్పిన మాటలు వినగానే గాయత్రి కి కోపం వస్తుంది నువ్వు చెప్పింది చాలు ఏం చేయాలో నేను చూసుకుంటాను అని గాయత్రీ చెబుతుంది..
పూనకం వచ్చిన గాయత్రి మాట్లాడే మాటలకు ఇంట్లో వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అవుతారు..!? తులసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..!? అంకిత తులసికి ఫేవర్ గా మాట్లాడుతుందా.? లేదంటే రివర్స్ అవుతుందా..! గాయత్రి ఇంట్లో వాళ్లందరినీ పోలీస్స్టేషన్లో పెట్టిస్తుందా..!? మిగతా విషయాలు తరువాయి భాగంలో తెలుసుకుందాం..
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!