Allu Arjun: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీతో సినిమా చేయాలని బాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రమే కాదు టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఆరాటపడుతుంటారు. కానీ, ఇప్పటి వరకు మన టాలీవుడ్ స్టార్స్ ఎవరూ ఆయన దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం అందుకోలేకపోయారు. అయితే, తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్, బాలీవుడ్ అగ్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని ముంబైలో కలిసిన సంగతి తెలిసిందే. ముంబైలోని భన్సాలీ ఆఫీసుకు వెళ్ళిన అల్లు అర్జున్ లేటెస్ట్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
భన్సాలీ, బన్నీ మధ్య చాలాసేపు చర్చలు జరిగాయి. తాజా సమాచారం ప్రకారాం అల్లు అరవింద్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘రామాయణం’ కోసమే వీరిద్దరూ కలిసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇతిహాసం రామాయణం ఆధారంగా అల్లు అరవింద్ చాలా ఏళ్ళ క్రితం ఓ హిందీ ప్రాజెక్టు చేయాలనుకున్నారు. అల్లు అరవింద్ – మధు మంతెన – నమిత్ మల్హోత్ర నిర్మాతలుగా ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించాలను కున్నారు. దీనికి ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారి మరియు ‘మామ్’ ఫేమ్ రవి ఉద్యవార్ దర్శకత్వం వహిస్తారని, 3డీలో ఈ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేశారు.
Allu Arujn: త్వరలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
కానీ, అనివార్య కారణాల వల్ల ఆ తర్వాత కరోనా కారణంగా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఇప్పుడు ఇదే ప్రాజెక్ట్ను మళ్ళీ పట్టాలెక్కించాలనే సన్నాహలు అల్లు అరవింద్ చేస్తున్నారట. దీనికోసం అల్లు అర్జున్ దర్శకుడు భన్సాలీని కలిశాడట. ఇందులో హీరోగా అల్లు అర్జున్ నటించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప పాన్ ఇండియన్ స్థాయిలో హిట్ సాధించింది. హిందీలో రూ.100 కోట్లకు పైగానే వసూళ్ళు రాబట్టింది. దాంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారట. త్వరలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.