మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ పై కోపంగా ఉన్నాడని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. దానికి కారణం ఏంటంటే దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత చిరు నటించిన సినిమా ‘ఖైదీ నంబర్ 150’ 2017 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా అయిపోగానే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సైరా మూవీని కూడా మొదలు పెట్టాడు. సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాని కూడా కొణిదెల ప్రొడక్షన్స్ పై చరణే నిర్మిస్తున్నాడు. ప్రెస్టీజియస్ గా షూటింగ్ జరుపుకుంటున్న సైరా సినిమా నిజానికి 2018లోనే విడుదల కావాలి కానీ షెడ్యూల్ డిలేస్ కారణంగా సైరాని 2019 సమ్మర్ కి వాయిదా వేశారు.
సమ్మర్ కైనా సైరా వస్తుంది అనుకుంటే అది కాస్త మళ్లీ 2019 దసరాకి వాయిదా పడింది. పోనీ అప్పుడైనా ప్రేక్షకుల ముందుకి వస్తుందా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. దీనికి కారణం చరణ్, సురేందర్ రెడ్డి తీసుకుంటున్న అతి జాగ్రత్తలే అని తెలుస్తోంది. ఇప్పటికే డిలే అయినా కూడా మేకింగ్ పరంగా ఎక్కడా రాజీపడకుండా సైరా సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలనే దర్శకుడు, నిర్మాత కలిసి సైరాని లేట్ చేస్తున్నారని, ఈ విషయం చిరుకి నచ్చట్లేదని ఇండస్ట్రీ వర్గాల టాక్. నిజానికి ఒక స్టార్ హీరో రెండేళ్ల పాటు సినిమా చేయకపోవడం పెద్ద విషయమే. అయితే సైరా సురేందర్ రెడ్డి అనుభవ రాహిత్యం కూడా సైరా డిలేకి మరో కారణమని తెలుస్తోంది. ఇప్పటి వరకూ కమర్షియల్ సినిమాలనే చేసిన సురేందర్ రెడ్డి, పీరియాడికల్ మూవీకి టైమ్ తీసుకుంటున్నట్లున్నాడు. కారణం ఏదైనా సైరా విషయంలో చరణ్ తీసుకుంటున్న అతి జాగ్రత్తలు సినిమాపై ఉన్న ఆసక్తిని తగ్గిస్తున్నాయి. వీలైనంత త్వరగా బాలన్స్ షూటింగ్ పార్ట్ పూర్తి చేసి సైరా సినిమాని వచ్చే సంక్రాంతికైనా విడుదల చేస్తారేమో చూడాలి.