Chiranjeevi – Ram charan: ఆ మలయాళం రీమేక్ మెగా మల్టీస్టారర్గా రావాలంటున్న మెగా ఫ్యాన్స్..? ఇప్పటికే మెగా హీరోలు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి మగధీర, బ్రూస్లీ సినిమాలలో కనిపించారు. ఇలా కనిపించింది కొద్దిసేపే. అది మెగా అభిమానులకు సరిపోలేదు. ఇక మెగాస్టార్ నటించిన బావగారు బాగున్నారా, కొండవీటి దొంగ, శంకర్ దాదా సిరీస్లలో మెగా బ్రదర్స్ నాగబాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నటించారు. ఇదీ అస్సలు మెగా ఫ్యాన్స్ను తృప్తి పరచలేకపోయింది. మళ్ళీ మెగా సోదరులు ఎప్పుడెప్పుడు కలిసి భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని చేస్తారో అని ఎదురుచూస్తున్నారు.
ఇక ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఆచార్య సినిమాను కంప్లీట్ చేశారు. ముందు ఈ సినిమాలో చరణ్ పాత్ర చాలా చిన్నది. అది కూడా కేవలం 20 నిమిషాలే. వాస్తవంగా చెప్పాలంటే ఈ రోల్ కూడా సూపర్ స్టార్ మహేశ్ బాబు చేయాల్సింది. కానీ, కరోనా కారణంగా బడ్జెట్ సమస్యలు తలెత్తడంతో మహేశ్ బాబు స్థానంలో చరణ్ వచ్చి చేరారు. దాంతో కొరటాల శివ ఆచార్య సినిమాలో చరణ్ పాత్రను ఇంకా డెవలప్ చేసి సినిమాలో గంటకు పైగా ఉండేలా స్క్రిప్ట్లో మార్పులు చేర్పులు చేశారు.
Chiranjeevi – Ram charan: మెగాస్టార్ – మెగా పవర్ స్టార్ కలిసి బ్రో డాడీ రీమేక్..!
దాంతో ఆచార్య మెగా మల్టీస్టారర్ అయింది. చిరు – చరణ్ కలిసి సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేసే సన్నివేశాలు ఆచార్యలో మెండుగా ఉన్నాయి. అయితే ఈ సినిమా పోస్టర్స్, టీజర్ చూశాక మళ్ళీ మళ్ళీ ఇద్దరు కలిసి నటించాలనుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో మలయాళ చిత్రాలు తెలుగులో చాలానే రీమేక్ అవుతున్నాయి. వాటిలో మలయాళ హిట్ సినిమా బ్రో డాడీ సినిమా. ఈ సినిమాలో చాలామంది నటిస్తారని ప్రచారం జరుగుతోంది. వెంకటేశ్ – రానా, నాగార్జున – అఖిల్ అని ఇప్పటివరకు వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు మెగా అభిమానులు మెగాస్టార్ – మెగా పవర్ స్టార్ కలిసి బ్రో డాడీ రీమేక్ చేస్తే చూడాలని కోరుకుంటున్నారు. మెగా అభిమానుకు గట్టిగా కోరుకుంటే అయిపోద్దని అంటున్నారు.