Sarkaaru Vaari Paata: ఈ మధ్య సర్కారు వారి పాట సినిమా విషయంలో కొన్ని వార్తలు వచ్చి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇవి ఎంత వరకు నిజమో తెలీదు గానీ.. అభిమానులకు మాత్రం కాస్త కంగారుగా ఉంటుందట. సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్లో మహేశ్ బాబు సరసన కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తోంది. పరశురాం పెట్లా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మహేశ్ బాబు..14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్తో కలిసి భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.
ఇప్పటికే సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైనప్పటి నుంచి ఇటీవల వచ్చిన సెకండ్ సింగిల్ పెన్నీ సాంగ్ వరకు ప్రతీదీ అంచనాలు పెంచేవిగానే ఉన్నాయి. అందుకే, మహేశ్ అభిమానులు ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నారు. వాస్తవానికి సర్కారు వారి పాట సినిమాకు ఆ స్కోప్ బాగానే ఉంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే ఆర్ధిక కుంభకోణల నేపథ్యంగా సాగే యూనివర్సల్ కథ. కాబట్టే మేకర్స్ ఈ సినిమాను దుబాయ్, టర్కీ, గోవా, అమెరికా, హైదరాబాద్లలో షూటింగ్ జరిపారు.
Sarkaaru Vaari Paata: ఇప్పుడు వస్తున్నవన్నీ కేవలం రూమర్సేనట.
ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్కు కూడా పూర్తవుతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ సమయం దగ్గరపడుతోంది. కానీ, ఇటీవల మరోసారి ఈ సినిమా వాయిదా పడుతుందని ఇది పాన్ ఇండియన్ సినిమా రేంజ్లో అన్నీ భాషలలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని అందుకే రిలీజ్ వాయిదా పడే అవకాశాలున్నాయ ని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు అనుకున్నట్టుగానే మే 12న ఈ సినిమా రిలీజ్ అవుతుందట. ఇందులో ఎలాంటి మార్పూ ఉండదని సమాచారం. ఇక ఇది పాన్ ఇండియా రిలీజ్ కూడా కాదని తెలుస్తోంది. ఇప్పుడు వస్తున్నవన్నీ కేవలం రూమర్సేనట.