అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సీమ టపాకాయ్ సినిమాతో టాలీవుడ్ కి వచ్చిన కేరళ అమ్మాయి పూర్ణ. ముస్లిం కుటుంబంలో పుట్టిన పూర్ణ అసలు పేరు షమ్మా ఖాసిం. శాస్త్రీయ నృత్య కళాకారిణికి తన కెరీర్ ప్రారంభించిన షమ్మా ఖాసిం మోడల్ గా ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. సినిమాల కోసం తన పేరును పూర్ణ గా మార్చుకుంది. తెలుగు తమిళం మళయాళం హిందీ సినిమాలలో నటిస్తూ మంచి ఫేం ని సంపాదించుకుంది.
ముఖ్యంగా రవి బాబు తెరకెక్కించిన ‘అవును’, ‘అవును 2’ సినిమాలతో పాటు కమెడియన్ శ్రీనివాస రెడ్డి హీరోగా వచ్చిన జయమ్ము నిశ్చయమ్మురా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. గత కొంత కాలంగా తెలుగు సినిమాలకి దూరంగా ఉన్న పూర్ణకు బెదిరింపులు వచ్చాయి. భయంతో ఆమె పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం బయటపడింది. పూర్ణ బెదిరింపు వెనుక పెద్ద మాఫియా ఉండవచ్చనే అనుమానాలు కలుగుతున్నాయట.
ఈ నేపథ్యంలో పూర్ణ తాజాగా కేరళ రాష్ట్ర పోలీసులను ఆశ్రయించింది. లక్షల రూపాయలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేసింది. అయితే పూర్ణతోపాటు మరికొంతమందిని కూడా బ్లాక్ మెయిల్ చేసినట్టు సమాచారం. ఈ వివాదం వెనుక ఒక పెద్ద మాఫియానే ఉందని పోలీసులు ఆరాతీస్తున్నారు. ఈ క్రమంలోనే పూర్ణకు సెక్యూరిటీ పెంచి ఈ కేసును లోతుగా పరీలిస్తున్నారు. చాలా మంది హీరోయిన్లను ఈ మాఫియా బెదిరించి డబ్బు కావాలని లేదంటే తమ ఫొటోలను వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామంటూ బ్లాక్ మేయిల్ చేస్తున్నారని తెలుస్తుంది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!