Prabhas: పాన్ ఇండియన్ ప్రభాస్ నటించిన సినిమాలన్నీ అనుకున్న సమయానికి రిలీజ్ కావడం లేదు. ఇప్పటికే పీరియాడికల్ రొమాంటిక్ సినిమా రాధే శ్యామ్ చాలాసార్లు పోస్ట్ పోన్ అయింది. ఎట్టకేలకు మార్చి 11వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. సంక్రాంతి బరిలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా థర్డ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణం రాజు, బాలీవుడ్ నటి భాగ్యశ్రీ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. బాలీవుడ్, కోలీవుడ్ సంగీత దర్శకులు, మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రభాస్ కెరీర్లో మొదటిసారి చేస్తున్న ఓ డిఫరెంట్ రోల్, అలాగే పదేళ్ళ తర్వాత చేస్తున్న లవ్ స్టోరి కావడంతో భారీగా అంచనాలున్నాయి.
అయితే, సలార్ కూడా కరోనా కారణంగా అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాలేదు. కానీ, షూటింగ్ పూర్తై కూడా ప్రకటించిన తేదీకి రిలీజ్ చేయలేకపోతున్నారు. ప్రభాస్ నటిస్తున్న పౌరాణిక సినిమాలో ఆయన రాముడిగా నటిస్తున్నారు. కృతి సనన్ సీత పాత్రలో కనిపించబోతున్నారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ లంకేశ్ పాత్రలో యువ నటుడు సన్నీ సింగ్ లక్ష్మణ పాత్రలో అలరించబోతున్నారు. బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఆదిపురుష్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దాదాపు రూ 500 కోట్లతో నిర్మిస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న పౌరాణిక చిత్రం కావడంతో అందరిలోనూ భారీ అంచనాలున్నాయి.
Prabhas: దసరా బరిలో ‘ఆదిపురుష్’ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట
ఇక ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 11వ తేదీన రిలీజ్ చేయబోతున్నామని గత ఏడాదే అధికారికంగా ప్రకటించారు. అనుకున్నట్టుగానే మేకర్స్ షూటింగ్ను పూర్తి చేశారు. పోస్ట్ప్రొడక్షన్స్ వర్క్ కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు. కానీ, ఇప్పుడు ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ అనుకొని పోస్ట్పోన్ చేసి ప్రభాస్ ఆదిపురుష్ రిలీజ్ అనుకున్న ఆగస్టు 11న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు ఆదిపురుష్ సినిమా వాయిదా విషయాన్ని మేకర్స్ కంటే ముందు ఆమిర్ వెల్లడించాడు. దాంతో ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న టాక్ ప్రకారం దసరా బరిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఆగస్ట్ నుంచి పోస్ట్ పోన్ అయిన సినిమాకు దసరా సీజన్ తప మరొకటి కరెక్ట్ కాదని మేకర్స్ భావిస్తున్నారట. చూడాలి మరి అఫీషియల్గా తేదీని ఎప్పుడు లాక్ చేస్తారో.