మహానటి సినిమాతో టాలీవుడ్ తో పాటు సౌత్ సినిమా ఇండస్ట్రీ మొత్తం పాపులారిటీని సాధించింది కీర్తి సురేష్. తెలుగు తమిళం లో ఎక్కువ సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరో వైపు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు ఒప్పుకుంటుంది. మహానటి తర్వాత ఎక్కువగా తమిళంలో నే సినిమాలు చేసింది. విక్రం, విశాల్, విజయ్ లాంటి స్టార్ హీరోల సరసన నటించింది. అయితే ఆ సినిమాలు అక్కడ ఫ్లాప్ గా మిగిలాయి.
ఇక కీర్తి సురెష్ రీసెంట్ గా పెంగ్విన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాలుగు ప్రధాన భాషల్లో నేరుగా ఓటీటీలో రిలీజైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని తెచ్చుకుంది. ఇంకా చెప్పాలంటే చాలామందిని నిరాశ పరచిందనే చెప్పాలి. ఈ ప్రభావం ఇప్పుడు తన తర్వాత సినిమా మిస్ ఇండియా మీద పడిందని అంటున్నారు. ఈ సినిమాని కూడా ఓటీటీలో రిలీజ్ చేయాలనుకుంటున్న నిర్మాతలకి పెద్ద షాక్ తగిలింది. అంతక ముందు వచ్చిన ఆఫర్ లో దాదాపు 30 శాతం కోత పడింది. అయినా సరే అని రిలీజ్ చేస్తారా లేదా చూడాలి.
ఇదిలా రీసెంట్ గా కీర్తి సురేష్ కి పెళ్ళి అంటూ వార్తలు వచ్చాయి. అందరు నమ్మారు కూడా. అందుకు కారణం ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో చాలామంది సెలబ్రిటీస్ పెళ్ళి చేసుకోవడమే. ఇప్పటికే ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్నాడు. అలాగే యంగ్ హీరో నిఖిల్ వివాహం కూడా జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంగేజ్ మెంట్ అయిన నితిన్, రానా లు ఆగస్టులో ఒక ఇంటివాళ్ళు కాబోతున్నారు. దీంతో సోషల్ మీడియాలో బాగా నలిగిన వార్తనే మళ్ళీ తిప్పి రాశారు. ఇప్పటికే ఒకసారి తన పెళ్ళి విషయంలో క్లారిటీ ఇచ్చింది కీర్తి సురేష్. నా పెళ్ళి మీద వస్తున్నవన్ని రూమర్స్ అని క్లియర్ గా చెప్పింది. అయినా మళ్ళీ కీర్తి సురేష్ పెళ్ళి అంటూ రాసేస్తున్నారు. మరి ఈసారి ఎలా రియాక్టవుతుందో చూడాలి.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!