Mahesh – Rajamouli: సూపర్ స్టార్ మహేశ్ బాబు – దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ పాన్ ఇండియన్ సినిమా మొదలవ్వాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ సక్సెస్తో ఎంజాయ్ చేస్తున్నారు. త్వరలో ఫ్యామిలీ ట్రిప్ వేయనున్నారు. విదేశాలకు తన ఫ్యామిలీతో వెళ్ళి కొన్నళ్ళు గడిపి తిరిగి ఇండియాకు రానున్నారు. ఆ తర్వాత మహేశ్ బాబు సినిమా కథ పూర్తి స్థాయిలో రెడీ చేసే పనిలో బిజీ కాబోతున్నారు. ప్రస్తుతం మహేశ్ బాబు తన సర్కారు వారి పాట సినిమా రిలీజ్ చేసే పనుల్లో బిజీగా ఉన్నారు.
కీర్తి సురేశ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడు. జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ – మైత్రీ మూవీ మేకర్స్ – 14 రీల్స్ ప్లస్ కలిసి భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. బ్యాకింగ్ రంగంలో తెరకెక్కిన ఈ సినిమా చాలా స్టైలిష్గా హాలీవుడ్ రేంజ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత చాలా గ్యాప్ వచ్చిన మహేశ్ ఇప్పుడు రాబోతున్న సర్కారు వారి పాట సినిమాతో సాలీడ్ హిట్ అందుకోవాలని ట్రై చేస్తున్నారు. ఈ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ దక్కించుకోవాలని అభిమానులు కోరుతున్నారు.
Mahesh – Rajamouli: దసరా పండుగ రోజు ప్రారంభించాలని రాజమౌళి బృందం ప్లాన్ చేస్తుంది.
ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాను మొదలు పెట్టబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ను జూన్ నుంచి మొదలు పెట్టేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే, రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు చేసే సినిమా దసరా పండుగ రోజు ప్రారంభించాలని రాజమౌళి బృందం ప్లాన్ చేస్తుంది. విజయదశమి నాడు లాంఛనంగా ప్రాజెక్ట్ను మొదలుపెట్టి ఆ తర్వాత కంప్లీట్ స్క్రిప్ట్ రెడీ అయ్యాక రెగ్యులర్ షూటింగ్ను మొదలుపెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తాజా సమాచారం.