Pawan kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకే పా స్టార్ పవన్ కళ్యాణ్ ఆ సినిమాలు కమిటవుతు న్నారా..? అంటే ఏ సినిమాలు..ఎవరికిచ్చిన మాట అని అందరిలోనూ రక రకాల సందేహాలు రాకమానవు. పవన్ రీ ఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలను కమిటయ్యారు. మొత్తం 6 సినిమాలు ఒప్పుకున్న పవన్ ఇప్పటికే వకీల్ సాబ్, భీమ్లాయాక్ సినిమాలను పూర్తి చేశారు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీర మల్లు సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. అలాగే, హరీశ్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్సింగ్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాను చేయాల్సి ఉంది.
ఇక తన సినిమాలను చేస్తూనే..మరో నిర్మాణ సంస్థతో కలిసి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై చిన్న మీడియం బడ్జెట్ సినిమాలను 15 వరకు నిర్మించేలా ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఎప్పుడో వచ్చేసింది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్స్ను పట్టాలెక్కించేందుకు పవన్ భాగస్వామితో కలిసి రెడీ అవుతున్నారట. వీటిలో రెండు సినిమాలను మాత్రం తన మేనల్లుళ్ళు అయిన సాయి ధరం తేజ్, వైష్ణవ్ తేజ్లతో నిర్మిస్తారని సమాచారం.
Pawan kalyan: పవన్ కళ్యాణ్ మేనల్లుళ్ళతో ఈ రీమేక్ చిత్రాలు..!
ఇప్పటికే తమిళ సూపర్ హిట్ మూవీ ‘వినోదాయ సితమ్’ను తెలుగులో పవన్ కల్యాణ్ రీమేక్ చేయబోతు న్నారని సమాచారం. తమిళంలో సముద్రఖని నటించి ఈ మూవీని తెరకెక్కించగా తెలుగు రీమేక్ తెరకెక్కించే బాధ్యతను కూడా పవన్ ఆయనకే అప్పగించనున్నారు. దీనిలో సాయి ధరం తేజ్ హీరోగా నటించనున్నారు. అలాగే, యువ దర్శకుడు సుధీర్ వర్మ డైరెక్షన్లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఓ సినిమాను నిర్మించనుండగా ఇందులో వైష్ణవ్ తేజ్ తో కలిసి ఓ రీమేక్ మూవీని చేస్తారట. తన అక్కకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకే పవన్ కళ్యాణ్ మేనల్లుళ్ళతో ఈ రీమేక్ చిత్రాలను చేస్తున్నారని సమాచారం.