Radhe shyam: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన విజువల్ వండర్ ‘రాధేశ్యామ్’. ఇందులో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే ప్రభాస్ సరసన నటించింది. యూవీ క్రియేషన్స్ దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఇక ఈ సినిమా ప్రారంభ వసూళ్ల పరంగా సంచలనం సృష్టించిందనే చెప్పాలి. నెగిటివ్ టాక్తో కూడా మొదటి మూడు రోజుల్లో మంచి వసూళ్ళు రాబట్టింది ఈ సినిమా. ఈ మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇక ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ రావడం విశేషం. అయితే మిక్స్డ్ టాక్ కూడా గట్టిగానే వినిపిస్తోంది. ముఖ్యంగా సినిమా స్లోగా సాగుతుందని కొంత మంది అభిప్రాయపడుతున్నారు.
ఇక కొంతమంది ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా వచ్చిన ‘రాధేశ్యామ్’ మూవీలో ఆ ఫీల్ కనిపించడం లేదని ఓపెన్గానే చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఇండస్ట్రీ వర్గాలలోనూ కూడా ఇదే మాట వినిపించింది. ఇక ముందు మేకర్స్ అనుకున్న ప్రకారం ‘రాధేశ్యామ్’ నిడివి కూడా చాలా పెద్దది. అయితే, అంత నిడివి ఎందుకని ఈ సినిమా చూసిన దర్శక ధీరుడు రాజమౌళి సూచించడంతో మేకర్స్ ఫైనల్ కట్ కి వచ్చేసరికి ట్రిమ్ చేసేశారు. దాదాపు 12 నిమిషాలకు పైగా సినిమాను తగ్గించారు. ఇప్పుడు ఇదే ఈ చిత్రానికి పెద్ద డ్రా బ్యాక్ గా మారిందని కొంత మంది మాట్లాడుకుంటున్నారు.
Radhe shyam: ఈ విషయంలో ప్రభాస్ కూడా మిస్ అయ్యారు.
సినిమా కథ డెస్టినీ వర్సెస్ లవ్ నేపథ్యంలో తెరకెక్కింది. అయితే రిలీజ్ తరువాత డెస్టినీతో హీరో పోరాడే సన్నివేశాలని చూపించారు. కానీ ప్రేమకు సంబంధించిన బలమైన సన్నివేశాలని మాత్రం సినిమాలో చూపించలేదు. అసలు ‘రాధేశ్యామ్’లో చూపించాల్సిది తన ప్రేమ కోసం హీరో విధితో పోరాడిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకునేదని ప్రస్తుతం అభిమానుల్లో, ప్రేక్షకుల్లో చర్చ జరుగుతోంది. ఈ విషయంలో ప్రభాస్ కూడా మిస్ అయ్యాడని అందుకే ‘రాధేశ్యామ్’ సినిమాకు ఈ టాక్ రావడం..రిజల్ట్ తేడా కొట్టడానికి కారణం అంటున్నారు. ఓవరాల్గా టాక్ ఎలా ఉన్నా..వసూళ్ళు మాత్రం మేకర్స్కు సంతృప్తిగానే ఉన్నాయి.