పూరి జగన్నాధ్ కొడుకు ఆకాష్ ని పెట్టి మెహబూబా సినిమాని నిర్మిస్తూ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా రిలీజ్ కి ముందు భారీ అంచనాలు నెలకొన్నప్పటికి కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాలేదన్న వార్తలు వచ్చాయి. అయితే పూరి కొడుకు హీరో మెటీరియల్ ..మంచి ఫ్యూచర్ ఉంది అన్న టాక్ మాత్రం సంపాదించుకున్నాడు. యాంక్టింగ్..యాక్షన్ సీన్స్ ..ఎమోషన్స్ ..ఇలా అన్నిటిలో ఆకాష్ మంచి పర్ఫార్మర్ అని నిరూపించుకున్నాడు. దాంతో పూరి మరో సినిమాని చేయాలని డిసైడయ్యాడు.
అయితే ఈ సారి మాత్రం కొడుకుని డైరెక్ట్ చేయడం లేదు. పూరి దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన అనిల్ పాడూరి కి దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. రొమాంటిక్ అన్న టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా యూత్ కి బాగా కనెక్ట్ అయిందని చెప్పాలి. అంతేకాదు ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ అండ్ టీజర్ చూసిన అందరు ఇడియట్ 2 అని మాట్లాడుకుంటున్నారు.
ఇక దాదాపు టాకీ పార్ట్ కంప్లీట్ అయిన ఈ సినిమాని బ్యాలెన్స్ వర్క్ ని ఫినిష్ చేసి ఏప్రిల్ లోనే రిలీజ్ చేయాలనుకున్నారట. కాని లాక్ డౌన్ తో పెండింగ్ పడింది. అయితే ఇప్పుడు పూరి ఆ బ్యాలెన్స్ వర్క్ ని కంప్లీట్ చేసి రిలీజ్ కి సిద్దంగా ఉంచాలని సన్నాహాలు చేస్తున్నారట. దాంతో ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయడానికి పూరి ఆసక్తిగా ఉన్నాడన్న వార్తలు వచ్చాయి. కాని అందులో వాస్తవం లేదని విశ్వనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. పొరపాటున కూడా పూరి ఆ తప్పు చేయడని అంటున్నారు. సాధ్యమైనంత వరకు థియోటర్స్ లోనే రొమాంటిక్ సినిమాని రిలీజ్ చేస్తామని పూరి టీం అంటున్నారట. ఇక ఈ సినిమాకి ఛార్మి ఒక నిర్మాతగా వ్యవహరిస్తుంది.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!