మన్మధుడు-2 లో నాగార్జున సరసన నటించిన తర్వాత టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఫేట్ మొత్తం తిరగబడింది. తిరిగి చూసుకున్నా దరిదాపుల్లో ఒక్క అవకాశం కూడా కనిపించడం లేదు. మంచి క్రేజ్ ఉన్న రకుల్ మీద మన్మధుడు-2 ఎఫెక్ట్ గట్టిగానే పడింది. ఇక లాక్ డౌన్ తో ముంబైలో మూడు నెలల పాటు ఒకేచోట ఉంది రకుల్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు అందరూ వాళ్ల ఫ్యామిలీతో కలిసి గడుపుతున్న సంగతి తెలిసిందే.
అయితే రీసెంట్ గా సినీ ఇండస్ట్రీలకు నిబంధనలతో కూడిన సడలింపులు అనుమతులు ఇవ్వడంతో ఒక్కొక్కరు తమ సినిమా షూటింగ్స్ ప్రారంభించేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నారు. ఇక లాక్ డౌన్ తర్వాత షూటింగులో పాల్గొనబోతున్న హీరోయిన్స్ లో రకుల్ కూడా ఉండటం ఆసక్తికరం. త్వరలోనే రకుల్ బాలీవుడ్ సినిమా షూటింగులో జాయిన్ అవబోతుందట.
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ సినిమాలో అర్జున్ కపూర్ హీరోగా నటిస్తుండగా రకుల్ ప్రీత్ అతనికి జంటగా నటిస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ యూరప్ లో జరగాల్సి ఉండగా కరోనా మహమ్మారి తో ఆషెడ్యూల్ కాన్సల్ చేసి ముంబైలోనే చిత్రీకరణ జరపాలని ప్లాన్ చేశారట. ఈ నేపథ్యంలోనే రకుల్ కి గుర్గావ్ నుండి మళ్లీ ముంబైకి రావాల్సి ఉంటుందని మేకర్స్ నుండి ఫోన్ కాల్ వచ్చిందట. షూటింగ్ అనగానే ఉత్సాహం రెట్టింపు అయినప్పటికి ముంబై అనగానే ఒక్కసారిగా వణుకొచ్చిందట. అందుకు కారణం ముంబై లో కరోనా మహమ్మారి విస్తృతంగా ఉండటమే. అయినా వృత్తి కోసం వెళ్ళాలి కదా ..!