Ram charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – శంకర్ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే కొంత టాకీ పార్ట్ ఓ యాక్షన్ సీక్వెన్స్, ఓ సాంగ్ పూర్తయ్యాయి. ఇక తాజా షెడ్యూల్ ఈ నెల 10వ తేదీ నుంచి మొదలవ్వాల్సి ఉంది. కానీ, చరణ్ ముంబైలో ఉండటం వల్ల మరో మూడు రోజులు వెనక్కి వెళ్ళింది. ఫిబ్రవరి 13వ తేదీ నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలవనుంది. ఇప్పటికే శంకర్ మూవీ షూట్ కోసం లొకేషన్స్ ఫైనల్ చేశారు. కొన్ని కీలక సన్నివేశాలని ఏపీలో షూట్ చేయనున్నారు. దీని కోసం ఇప్పటికే మేకర్స్ పర్మీషన్ కోసం ఏపీ పోలీసులకు వినతి పత్రాన్ని కూడా సమర్పించారు.
ఇక ఈ సినిమాతో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్ కూడా చరణ్ కమిటయ్యాడు. దీనికి డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించబోతున్నారు. ఇక తాజాగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రామ్ చరణ్ చేయనున్న సినిమాకి సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో, ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్.. ఎన్వి ఆర్ సినిమా కలిసి ఈ మూవీని భారీ బడ్జెట్తో సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి ఫిల్మ్ సర్కిల్స్ చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్నాయి. ఇందులో హీరోయిన్గా రష్మిక మందన్నను తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
Ram charan: రష్మికనే చరణ్, గౌతమ్ తిన్ననూరి సినిమాకు ఫైనల్ ఛాయిస్
ఇప్పుడు హీరోయిన్స్లో పాన్ ఇండియా పరంగా చూస్తే పూజా హెగ్డే తర్వాత రష్మిక మందన్నకే ఎక్కువ క్రేజ్ ఉంది. ఇంకా చెప్పాలంటే పూజా కంటే కూడా కాస్త ఎక్కువ క్రేజ్ రష్మికకే ఉంది. ఇటీవల వచ్చిన పుష్ప సినిమా తో 5 భాషలలో రష్మిక సంపాదించుకున్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఇప్పటికే చరణ్ సరసన పూజా హెగ్డే రంగ స్థలం సినిమాలో ఓ ఐటెం సాంగ్, ఆచార్య సినిమాలో హీరోయిన్గా నటించేసింది. మరోసారి కూడా పూజా అంటే అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అంతగా క్రేజ్ ఉండదని అంటున్నారు. అందుకే ఇప్పుడు చరణ్ సరసన రష్మిక మందన్న అయితే కాంబినేషన్ ఫ్రెష్గా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారట. చూడాలి ఫైనల్గా రష్మికనే చరణ్, గౌతమ్ తిన్ననూరి సినిమాకు ఫైనల్ ఛాయిస్ అవుతుందేమో.