Rashmika Mandanna: కన్నడ బ్యూటీ రష్మిక మందన్న తెలుగులో ఛలో సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన మొదటి సినిమా మంచి హిట్ సాధించే సరికి టాలీవుడ్ మేకర్స్ అందరి దృష్ఠి అమ్మడి మీద బాగానే పడింది. దాంతో వరుసగా అవకాశాలు అందుకుంది. గీత గోవిందం లాంటి డీసెంట్ హిట్ తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సరిలేరు నీకెవ్వరు లాంటి మాస్ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంది. మధ్యలో దేవదాసు, డియర్ కామ్రేడ్ లాంటి ఫ్లాప్స్ వచ్చినా కూడా రష్మిక మీద ప్రభావం చూపలేకపోయాయి.
ఇక భీష్మ రష్మిక కు మరో హిట్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిన రష్మిక ఏకంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన పాన్ ఇండియన్ సినిమా పుష్ప సిరీస్లో అవకాశం అందుకుంది. దీనికంటే ముందే కోలీవుడ్లో అడుగుపెట్టి కార్తి సరసన ఓ సినిమా చేసింది. అలాగే బాలీవుడ్లోను అడుగు పెట్టి రెండు సినిమాలు కంప్లీట్ చేసింది. అయితే, పుష్ప పార్ట్ 1 హిట్ తర్వాత పూర్తిగా బాలీవుడ్ మీదే రష్మిక గట్టిగా ఫోకస్ పెట్టింది. అక్కడ క్రేజీ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. హిందీ ఇండస్ట్రీలో క్రేజ్తో పాటు రెమ్యునరేషన్ కూడా భారీగా ఉంటుంది.
Rashmika Mandanna: పలు కారణాల వల్ల తాను తప్పుకోగా మేకర్స్ రష్మికను ఎంచుకున్నారట.
అందుకే, ఇకపై ఎక్కువగా హిందీ సినిమాలనే చేయడానికి ఈ కన్నడ బ్యూటీ ప్లాన్ చేసుకుంటుందట. ప్రస్తుతం తెలుగులో పుష్ప 2 తప్ప మరో సినిమాను కమిటవలేదు. కానీ, హిందీలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న యానిమల్ సినిమాలో నటించే అవకాశం అందుకుందని తాజాగా బాలీవుడ్తో పాటు సౌత్ మీడియాలోనూ వార్తలు వస్తున్నాయి. పరిణీతి చోప్రా ముందు ఇందులో హీరోయిన్ గా ఎంపికైంది. కానీ, పలు కారణాల వల్ల తాను తప్పుకోగా మేకర్స్ రష్మికను ఎంచుకున్నారట. ఇప్పటికే అక్కడ రెండు సినిమాలు రిలీజ్కు రెడీ అవుతున్నాయి. మరో మూడు సినిమాలు సైన్ చేసి ఉంది. అందుకే ఈ బ్యూటీ త్వరలో టాలీవుడ్కు టాటా చెప్తుందని మాట్లాడుకుంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?