పవర్ స్టార్ పవణ్ కళ్యాణ్ అంటే ఒక బ్రాండ్.. తన నటనతో ప్రేక్షకులను అట్టే కట్టపడేస్తారు మన గబ్బర్ సింగ్..తన స్టైల్ తో అమ్మాయిల కలల రాకురుడిగా మారారు మన పవన్ కళ్యాణ్. చిన్న చిన్న సినిమాలతో మొదులు పెట్టి ఎంతో పెద్ద పెద్ద హిట్ లను అందుకుంటున్నారు. అయితే సినిమాలో యాక్టింగ్ ఎంతో ముఖ్యమో అంతకు మించి దర్శకత్వం కూడా అంతే ముఖ్యం. అలాగే పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఎంతో స్నేహంగా మెలుగుతారు. వీళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని అందరూ అనుకుంటారు. అలాగే వారిరువురి మధ్య కూడా మంచి అనుబంధం కూడా ఉంది.
అయితే ప్రస్తుతం వారి మధ్య మనస్పర్ధలు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అజ్ఞాతవాసి డిజాస్టర్ తర్వాత వపన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ మాట్లాడుకోవడం లేదంటూ వార్తలు వినిపించాయి. కాని వారి మధ్య ఉన్న రిలేషన్ కారణంగా దాన్ని ఎవరూ నమ్మడం లేదు. కాని వారిరువురి మధ్య మౌనానికి కారణం మాత్రం ఓ సినిమానే అని అనుకంటున్నారు.
అజ్ఞాతవాసి సినిమా ప్లాఫ్ కావడంతో త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో మరొక సినిమా చేయాలని ఆశపడ్డారు. కాని పవన్ బిజీగా ఉండటంతో దానికి కుదరడం లేదు. కాగా దసరా ఫెస్టివల్ సందర్భంగా పవన్ మరో సినిమాకు ఓకే చెప్పాడు. ఇదే విషయం త్రివిక్రం ను బాగా హర్ట్ చేసిందనే చెప్పొచ్చు. చిన్న దర్శకుడు సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఓ సినిమాకు ఒప్పుకున్నాడు పవన్ కళ్యాణ్. ఇది మలయాళ సినిమా అయ్యప్పునుమ్ కోషియుమ్ రీమేక్..
ఇందులో బిజూ మీనన్ నటించిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ నటించబోతున్నాడు. ఈ సినిమా చేస్తే బాగుండు అని పవన్ కు సలహా ఇచ్చింది మాత్రం మాటల మాంత్రికుడే. కాని ఆ సినిమాకు మాత్రం దర్శకత్వం వహించడానికి త్రివిక్రం ముందుకు రావడం లేదు. దానికి కారణం మన మాటల మాంత్రికుడికి రీమేక్ సినిమాల పట్ల ఇష్టం లేకపోవడమే. దాంతో పవన్ నటించే ఈ రీమేక్ సినిమాకు త్రివిక్రం ఓకే చెప్పనట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే వారిరువురి మధ్య మాటల మౌనం తెరతీసిందని చెప్పుకోవచ్చు.