Sarkaaru Vaari Paata: గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ అండ్ రొమాంటిక్ సినిమా ‘సర్కారు వారి పాట’. ఈ సినిమాలో మహేశ్కు జంటగా బ్యూటీఫుల్ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ మూవీని భారీ బడ్జెట్తో జీఎంబీ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్నారు. ఇక సమ్మర్ కానుకగా 2022 మే 12న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతీది భారీగా అంచనాలు పెంచాయి.
ఒక పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తి కాగా, త్వరలో ఆ సాంగ్ను భారీ సెట్ వేసి చిత్రీకరించ నున్నారట. సర్కారు వారి పాటకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే. ఈ నెల 29న ఆచార్య సినిమా భారీ స్థాయిలో రిలీక్ కాబోతోంది. ఆ సినిమాకు బాబు సినిమాకు రెండు వారాల గ్యాప్ ఉంటుంది. ఒకవేళ ఆచార్య బ్లాక్ బస్టర్ అని టాక్ వస్తే..బాబు సినిమాకు కాస ఓపెనింగ్ ఆశించిన స్థాయిలో రావనే టాక్ వినిపిస్తోంది.
Sarkaaru Vaari Paata: మహేశ్ సినిమా మీద ఈ తమిళ హీరో ప్రభావం ఉంటుందా..!
అయితే, ఇప్పుడు సోలోగా రావాలనుకున్న మహేష్ బాబుకు పోటీగా తమిళ హీరో రాబోతున్నాడు. ఆ హీరోనే శివ కార్తికేయన్. ఈ మధ్య కాలంలో తను నటించిన తమిళ సినిమాలు తెలుగులో కూడా రిలీజై ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు తెలుగులో కూడా శివ కార్తికేయన్ స్ట్రైట్ సినిమాను చేస్తున్నాడు. ఇక మహేశ్ నటిస్తున్న సర్కారు వారి మే 12 విడుదలవుతుండగా, ఒక్కరోజు తేడాతో అంటే మే 13న శివ కార్తికేయన్ – ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తున్న డాన్ సినిమా రిలీజ్ కాబోతోంది. దాంతో బాక్సాఫీస్ వద్ద గట్టిగానే పోటీ నెలకొనే అవకాశం ఉందంటున్నారు. నిజంగానే మహేశ్ సినిమా మీద ఈ తమిళ హీరో ప్రభావం ఉంటుందా అనేది చూడాలి.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!