# RC 15: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో తన 15వ చిత్రాన్ని చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా’RC 15′ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతుంది. ఇక ఈ మూవీ తాజా షెడ్యూల్ రాజమండ్రిలో మొదలై శరవేగంగా సాగుతోంది. వాస్తవంగా ఫిబ్రవరి 10వ తేదీ నుంచే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, చరణ్ ముంబైలో వేరే బిజినెస్ వ్యవహారాలలో బిజీగా ఉండటంతో మూడు రోజులు ఆలస్యంగా అంటే ఫిబ్రవరి 13 నుంచి మొదలైంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్కు ఇది ప్రతిష్ఠాత్మకమైన సినిమా.
ఎందుకంటే ఈ సినిమా దిల్ రాజు సంస్థలో నిర్మితమవుతున్న 50వ సినిమా కావడం విశేషం. ఇటు చరణ్కు మైల్ స్టోన్ మూవీ 15, దిల్ రాజుకు మైల్ స్టోన్ మూవీ 50వది కావడంతో ఆయన ఏమాత్రం బడ్జెట్ విషయంలో వెనకాడకుండా నిర్మిస్తున్నారు. శంకర్, చరణ్ల రెమ్యునరేషనే భారీగా ఉందని టాక్. ఇక ఇందులో చరణ్ సరసన నటిస్తున్న కియారా అద్వానీ రెమ్యునరేషన్ కూడా భారీగానే ఉండబోతోంది. అంతేకాదు, ఈ సినిమాకు సంబంధించిన ఒక్కో సీన్, సాంగ్, యాక్షన్ సీన్స్ కోసమే భారీగా బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు. ఇక ఇందులో నటించే కీలక పాత్రధారులకు మంచి రెమ్యునరేషనే ఇస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.
# RC 15: షెడ్యూల్లో సూర్య జాయిన్ అయినట్టు తెలుస్తోంది.
శంకర్..తన సినిమాలో పాత్రలు ఎంత బలంగా ఉంటాయో ఆయా పాత్రలకు ఎంచుకునే నటీ నటులు అంత క్రేజ్ ఉన్నవారు ఉంటారు. రో 2.ఓ సినిమాలో విలన్ పాత్రలు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ను తీసుకున్నారు. ఇప్పుడు చరణ్ సినిమా కోసం ప్రముఖ తమిళ దర్శకుడు నటుడు ఎస్ జె సూర్యను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. విలన్ పాత్రల్లో సూర్య అదరగొడుతున్నాడు. హీరోలకు ధీటుగా సూర్య పర్ఫార్మెన్స్ ఉంటోంది. అందుకే ఆయన తెలుగులో సూపర్ స్టార్ మహేశ్ బాబు లాంటి హీరోల సినిమాలలో విలన్ పాత్రలు పోషించే అవకాశాలు అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆర్సి 15 కోసం ప్రాజెక్ట్లో జాయిన్ అయినట్టు తాజా సమాచారం. తాజాగా తూర్పుగోదావారి జిల్లాలో చిత్రీకరణ మొదలైన షెడ్యూల్లో సూర్య జాయిన్ అయినట్టు తెలుస్తోంది.