SVP: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ కథానాయకుడిగా నటించిన సర్కారు వారి పాట రిలీజై డివైడ్ టాక్ తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసినదే. మొదట ఫ్యాన్స్ ఈ సినిమా విషయంలో ఒకింత మానసిక ఒత్తిడికి గురయ్యారు. ఈ క్రమంలో దర్శకుడు పరుశురాంని సోషల్ మీడియా వేదికగా ఆడిపోసుకున్నారు. అయితే సినిమా రిజల్ట్ సంగతి ఎలా వున్నా, భారీ ఓపెనింగ్స్ సాధించిన మాట వాస్తవం అని టాలీవుడ్లో గుసగుసలు వినపడుతున్నాయి. అయితే సమ్మర్ హాలీడేస్ కావడం సహా ఇరత హీరోల సినిమాలు మార్కెట్ లో లేకపోవడంతో మహేష్ సినిమా వసూళ్లపై అంతగా ప్రభావాన్ని అయితే చూపించలేదు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కలెక్షన్లు అంతా ఫేక్?
ఇకపోతే ఈ సినిమా కలెక్షన్ల విషయంలో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్లు అన్ని ఫేక్ అని ఓ వర్గం వారు అంటే, ఘట్టమనేని అభిమానులు మాత్రం అవి నిజమేనని, సూపర్ స్టార్ మహేష్ బాబు స్టామినా ఏమిటో తెలుసుకోండి అని అభిమాన నటుడిని వెనకేసుకొస్తున్నారు. ఇక ఏది ఎలావున్నా, శని, ఆదివారలు ఇతర రంగాల వారికి సెలవులు కావడంతో హౌస్ పుల్ గానే థియేటర్లు నడుస్తున్నాయి. మరి అంతిమంగా ఫుల్ రన్ లో సర్కారు వారి పాట ఎంత సాధిస్తుందన్నది? తెలియడానికి ఇంకొంచెం సమయం పడుతుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కర్నూలులో సెలబ్రేషన్స్?
ఇలాంటి తరుణంలో చిత్ర యూనిట్ మాత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ షురూ చేసింది. ఈనెల 16న అంటే రేపు కర్నూల్ లో భారీ ఎత్తున అభిమానుల సమక్షంలో విజయోత్సవ వేడుక జరపబోతున్నారు. సిటీలోని ఎస్టీ బీసీ కళాశాలలో ఈ తంతు జరపనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి మ మ మాస్ మహేష్ పేరిట సెలబ్రేషన్స్ మొదలు కానున్నాయి. వీటికి మహేష్ సతీసమతేంగా హాజరు కానున్నారు. వాస్తవానికి ఈ వేడుకల్ని ముందుగా విజయవాడలో నిర్వహించాలని ప్లాన్ చేసారు. మేకర్స్ కూడా విషయానల్ని అధికారికంగా వెల్లడించారు. కానీ కొన్ని సమస్యల కారణంగా వేదికని విజయవాడ నుంచి కర్నూల్ కి మార్చారు.