మొదటి సినిమా పరువత్తీరన్ తోనే జాతీయ అవార్డ్ ను సాధించుకుంది ప్రియమణి. ఆ తర్వాత జగపతి బాబు కి జంటగా టాలీవుడ్ లో పెళ్ళైన కొత్తలో సినిమాలో నటించి టాలీవుడ్ దృష్ఠిని ఆకర్షించింది. అంతేకాదు దర్శక ధీరుడు రాజమౌళి, పూరి జగన్నాధ్ లాంటి స్టార్ డైరెక్టర్స్ నుంచి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి బ్లాక్ బస్టర్స్ ని తన ఖాతాలో వేసుకుని మంచి ఫాం ని కొనసాగించింది. వరసగా తెలుగు, తమిళ భాషల్లో పెద్ద పెద్ద బ్యానర్స్ లో అవకాశాలు దక్కించుకొని స్టార్ హీరోయిన్ గా మంచి పాపులారిటీని సాధించింది.
కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే ముస్తాఫ రాజ్ ని పెళ్ళి చేసుకొని సినిమాలకి దూరంగా ఉన్న ప్రియమణి.. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టింది. ఈ సెకండ్ ఇన్నింగ్స్ రెండు సినిమాలు దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలతో చేస్తుండటం విశేషం. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన అసురన్ రీమేక్ లో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. నారప్ప టైటిల్ తో తెలుగులో శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు నిర్మిస్తున్నారు.
అలాగే సురేష్ బాబు కొడుకు రానా దగ్గుబాటి హీరోగా విరాటపర్వం తెరకెక్కుతుంది. ఈ సినిమాలోను ప్రియమణి హీరోయిన్ గా నటిస్తుంది. మరో హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తుంది. అయితే ఈ ఇద్దరు హీరోయిన్స్ ఒకరికి ఒకరు పోటీ పడి ఈ సినిమాలో నటిస్తున్నారట. అయితే ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ లో సక్సస్ అవడానికి చాలానే శ్రమిస్తోంది. ఇక ఈ రెండు సినిమాలతో పాటు మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తున్న ప్రియమణికి టాలీవుడ్ సీనియర్ హీరోల సరసన నటించడానికి చర్చలు జరుగుతున్నాయని తాజా సమాచారం. కాని ఒక్క సినిమా కూడా 2020 లో రిలీజయ్యో అవకాశాలు కనిపించడం లేదు. 2020 లో రీ ఎంట్రీ ఇచ్చి మళ్ళీ హీరోయిన్ గా ఫాం లోకి రావాలనుకున్న ప్రియమణికి 2020 కలిసి రాలేదనే చెప్పాలి.