“SSMB 28” వర్కింగ్ టైటిల్ తో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు ఈ ఏడాది వేసవిలోనే ప్రారంభం అయింది. ఆ సమయంలో రెగ్యులర్ షూటింగ్ జూన్ నెల నుండి ప్రారంభం అవుతుందని చిత్ర యూనిట్ తెలపడం జరిగింది. కానీ ఇప్పుడు ఆగస్టు మూడోవారం వచ్చేసిన గాని షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. అయితే “SSMB 28” ఆలస్యం అవడానికి ప్రధాన కారణం.. త్రివిక్రమ్ కి మహేష్ చెప్పిన సూచన అని ఇండస్ట్రీ వర్గాలలో ఇన్ సైడ్ టాక్. మేటర్ లోకి వెళ్తే త్రివిక్రమ్ ఫస్ట్ వినిపించిన స్క్రిప్ట్ మొత్తం ఫ్యామిలీ యాక్షన్ డ్రామా తరహాలో ఉందట.
అయితే తనకి ఫుల్ యాక్షన్ మాస్ కంటెంట్ కలిగిన స్క్రిప్ట్ కావాలని కోరడంతో.. త్రివిక్రమ్ మొదటి స్క్రిప్ట్ మొత్తాన్ని చేంజ్ చేసి.. ఎక్కువ మాస్ ఎలిమెంట్స్ కలిగిన స్క్రిప్ట్ గా తీర్చిదిద్దారట. దీంతో త్రివిక్రమ్ సినిమా కథపై మరీన్ని రోజులు కూర్చోవడంతో..”SSMB 28″ షూటింగ్ ప్రారంభం కానట్టు టాక్. తాజా స్టోరీ తో ఫస్టాఫ్ రొమాంటిక్ ఉండగా ఇక సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ సన్నివేశాలు ఉండేలా త్రివిక్రమ్ స్క్రిప్ట్ రాసినట్లు వార్తలు వస్తున్నాయి. అందువల్లే ఈ సినిమాకి “విక్రమ్” సినిమా ఫైట్ మాస్టర్ ని తీసుకున్నట్లు సమాచారం.
చాలావరకు మాస్ ఆడియన్స్ నీ టార్గెట్ చేసుకుని త్రివిక్రమ్ స్క్రిప్ట్ రెడీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో త్రివిక్రమ్.. మహేష్ బాబుతో చేసిన అతడు, ఖలేజా రెండు కూడా మహేష్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. దీంతో వస్తున్న ఈ మూడో సినిమా “SSMB 28” పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో షూటింగ్ లు బంద్ కారణంగా “SSMB 28” రెగ్యులర్ షూటింగ్ మొదలు కాలేదట. ఇండస్ట్రీలో షూటింగ్స్ ప్రారంభమైన వెంటనే “SSMB 28” రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్లు సమాచారం.