ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు టైం నడుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే స్టార్ హీరోల లో ఎవరికీ లేని భారీ హిట్లు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మహేష్ కి ఉన్నాయి. భరత్ అనే నేను, మహర్షి ఈ ఏడాది ప్రారంభంలో “సరిలేరు నీకెవ్వరు” తో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ విజయాలు మహేష్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉండగా త్వరలో పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమాని స్టార్ట్ చేయబోతున్నారు.
సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ టైటిల్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు నాడు అనగా మే 31వ తారీఖున రిలీజ్ చేసి అభిమానులను ఎంతగానో మహేష్ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఈ సినిమాలో తాను హీరోయిన్ అని కీర్తి సురేష్ సోషల్ మీడియాలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. దీంతో సినిమాకి మంచి హైప్ పెరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ సీనియర్ హీరో అనిల్ కపూర్ తీసుకోవడానికి డైరెక్టర్ రెడీ అయినట్లు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
కాగా ఈ వార్త విని మహేష్ అభిమానులు ఈ సినిమాకి నెగటివ్ ఏదైనా ఉంది అంటే అది ఇదే అని అంటున్నారట. ఎందుకంటే బాలీవుడ్ ఇండస్ట్రీ లో సుశాంత్ సూసైడ్ కేస్ తర్వాత కపూర్లు, ఖాన్ల ఫ్యామిలీపై తీవ్ర స్థాయిలో ప్రేక్షకులలో వ్యతిరేకత ఉంది. ఇలాంటి తరుణంలో సినిమాలో అనిల్ కపూర్ ని తీసుకోవడం సినిమాకి మైనస్ అని మహేష్ అభిమానులు ఈ వార్త పై సోషల్ మీడియాలో తెగ డిస్కషన్లు చేసుకుంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?