Sarkaru Vaari Paata: మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ సహా అన్నీ సౌత్ ఇండస్ట్రీలలోనూ హీరోలకు, దర్శ – నిర్మాతలకు సెంటిమెంట్స్ బాగా ఉంటాయి. రిలీజ్ డేట్ విషయంలో హీరోయిన్ను ఎంచుకునే విషయంలో చాలా సెంటిమెంట్ ఫీలవుతుంటారు ఫాలో అవుతుంటారు. అందుకే ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా సర్కారు వారి పాట విషయంలో అభిమానుకు రెండు విషయాలలో బాగా టెన్షన్ పడుతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటి వరకు మహేశ్ బాబుకు వరుసగా హిట్స్ వస్తూనే ఉన్నాయి.
కాని, సర్కారు వారి పాట సినిమా విషయానికొచ్చే సరికి అభిమానుల్లో కంగారు మొదలైంది. ఎందుకంటే ఈ సినిమాలో హీరోయిన్ కీర్తి సురేశ్. మహానటి సినిమా తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు కీర్తి ఖాతాలో ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ చేరలేదు. ద్విభాషా చిత్రాలుగా వచ్చిన పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి, రజనీకాంత్ నటించిన అణ్ణాత్త, మలయాళంలో నటించిన మరక్కార్, తెలుగులో నటించిన రంగ్ దే సినిమాలన్ని ఫ్లాప్ సినిమాలుగా మిగిలాయి. దాంతో కీర్తి సురేశ్ నటించిన సినిమాలు ఫ్లాపవుతున్నాయనే టాక్ బలంగా వినిపిస్తోంది.
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట సినిమా రిలీజ్ విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో..?
అందుకే, సర్కారు వారి పాట సినిమాలో మహేశ్ సరసన కీర్తి నటుస్తుండటంతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ఇక మరో బ్యాడ్ సెంటిమెంట్ ఏంటంటే మహేశ్ బాబుకి మే నెల ఏమాత్రం కలిసి రాదు. ఇంతక ముందు బాబు నటించిన సినిమాలు మేలో రిలీజై ఫ్లాప్గా మిగిలాయి. ఇప్పుడు రూపొందుతున్న సర్కారు వారి పాట సినిమాను మే 12న కాకుండా ఏప్రిల్లో గానీ, జూన్లో గానీ రిలీజ్ చేయమని ..ఈ మేరకు కొత్త డేట్ ప్రకటిస్తే బావుంటుందని భావిస్తున్నారు. మరి మహేశ్ బృందం సర్కారు వారి పాట సినిమా రిలీజ్ విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి. కాగా, మహేశ్ ఈ సినిమా తర్వాత త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకవంలో ఓ పాన్ ఇండియన్ సినిమాను చేయబోతున్నాడు.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!