ఆర్ .ఎక్స్.100 సినిమాతో సెన్షేషనల్ హిట్ సాధించిన దర్శకుడు..రాం గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి. ఈ సినిమా తర్వాత అడప దడపా హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, హీరో కార్తికేయ సినిమాలు చేస్తున్నప్పటికి వారికి ఇంత క్రేజ్ తీసుకు వచ్చిన ఈ దర్శకుడు మాత్రం ఎందుకనో రెండవ సినిమా చేయలేకపోయాడు. అష్ట కష్టాలు పడుతున్నాడు. రెండవ సినిమానే మల్టీ స్టారర్ ని తెరకెక్కించాలనుకున్న అజయ్ భూపతి ప్లాన్ ఎక్కడా వర్కౌట్ కాలేదు.
ఈ సినిమా ముందు రవితేజ చెస్తానని కమిటయ్యాడు. కాని రెండవ హీరో దొరికే లోపే డ్రాపయ్యాడు. ఆ తర్వాత అక్కినేని నాగ చైతన్య చేస్తానని చెప్పుకొచ్చారు. అది అంతే అజయ్ భూపతి ఇంకో హీరోని పట్టుకునేలోపే చైతూ కూడా డ్రపయ్యాడు. ఎట్టకేలకి ఈ ప్రాజెక్ట్ కి శర్వానంద్, సిద్ధార్థ్ లను ఫైనల్ చేసుకున్నాడు.
ఈ యంగ్ హీరోలతో ‘మహాసముద్రం’ మల్టీస్టారర్ గా రూపొంచబోతున్నాడు. ఈ సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్ ప్రాణ స్నేహితులుగా కనిపించబోతున్నారట. అయితే వారి స్నేహమే ఓ అమ్మాయి వల్ల వైర్యంగా మారుతుందని.. అక్కడ నుంచి కథ పంథా మొత్తం హైరేంజ్ లో సాగుతుందని చెప్పుకొస్తున్నాడు అజయ్ భూపతి.
ఇక ఈ సినిమాలో అదితిరావు హైదరీ హీరోయిన్ గా నటించబోతుంది. ఇప్పటికే స్క్రిప్టు వర్క్ మొత్తం కంప్లీట్ అయిందట. వైజాగ్ బ్యాగ్డ్రాప్ లో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా ‘మహాసముద్రం’ తెరకెక్కనుంది. అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఇక అదితిరావు హైదరీ ఈ సినిమాకి సగం క్రేజ్ తీసుకువస్తుందని అంటున్నారు. ఇప్పటికే అదితిరావు హైదరీ నాని నటిస్తున్న వి సినిమాలో నటిస్తుంది.