టాలీవుడ్ లో ఇప్పటి వరకు రాజమౌళి చేసిన ప్రతీ సినిమాలో హీరోయిన్స్ కి కూడా కథలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మొదటి సినిమా స్టూడెంట్ నంబర్ నుంచి భారీ పాన్ ఇండియా సినిమాగా వచ్చిన బాహుబలి ఫ్రాంఛైజీ వరకు ప్రతీ సినిమాలో హీరోయిన్ ని అద్భుతంగా చూపించడం పాత్రకి ప్రత్యేకత ఉండటం మనకి తెలిసిందే. మగధీర సినిమాతో కాజల్ అగర్వాల్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఛత్రపతి లో శ్రియ, విక్రమార్కుడులో అనుష్క..ఇలా ఆయన సినిమాలలో హీరోయిన్స్ కి చాలా వేయిట్ ఉన్న క్యారెక్టర్ రాస్తారు.
ఇక బాహుబలి సినిమా మొదటి భాగం లో తమన్నా ఎంతగా పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. అంతేకాదు ఈ సినిమా తమన్నా కెరీర్ లో మొదటి పాన్ ఇండియా సినిమా కావడం కూడా విశేషం. అనుష్క కి ఎంతటి పేరు వచ్చిందో తమన్నాకి అంతే పేరు వచ్చింది. అందుకే ఆ తర్వాత కూడా మెగాస్టార్ చిరంజీవి నటించిన మరో పాన్ ఇండియా సినిమా సైరాలోను నటించింది. ఇక రీసెంట్ గా ఇదే విషయం ప్రస్థావిస్తూ దర్శక ధీరుడు రాజమౌళి మీద తమన్నా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
రాజమౌళి ఒకసారి తన సినిమాలో నటించారు కదా అని క్యారెక్టర్ సూటయినా కాకపోయినా మళ్ళీ పిలిచి నటీనటులకు అవకాశం ఇవ్వరని తెలిపింది. ఆయన రాసుకున్న పాత్రకి ఎవరైతే సరిగ్గా సరిపోతారనుకుంటారో వాళ్ళకే అవకాశం ఇస్తారని… ఒక వేళ ఎవరికైతే రాజమౌళి నుంచి కాల్ వస్తుందో వాళ్ళకే ఆ పాత్ర రాసి పెట్టి ఉంటుందని అభిప్రాయపడింది. మొత్తానికి రాజమౌళి గురించి తమన్నా చెప్పాలంటే చాలా ఖచ్చితంగా చెప్పిందని అంటున్నారు. ఇక ప్రస్తుతం తమన్నా గోపీచంద్ సరసన సీటీమార్ అనే సినిమాలో నటిస్తుంది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!