పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఫ్యాన్స్ కి, ప్రేక్షకులకి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. వరసగా రెండు సినిమాలు ఫ్లాపయినా కూడా ఆయన సినిమా రిలీజైన రోజున థియోటర్స్ దగ్గర ఉండే సందడి ఫ్యాన్స్ హడావుడి మాత్రం అసలు తగ్గదు. అయితే దాదాపు పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపించి రెండేళు దాటిపోయింది. రాజకీయాలలో తలమునకలై ఉన్న పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు చేస్తున్నాడనగానే ఇండస్ట్రీలో మేకర్స్ దగ్గర్నుంచి ఫ్యాన్స్ వరకు ప్రతీ ఒక్కరికి కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. ఇక దిల్ రాజుకైతే పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలనేది పెద్ద కల.
అనుకున్నట్టుగానే దిల్ రాజు సాధించాడు. పవన్ కళ్యాణ్ తో సినిమాని నిర్మిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమా కోసం భారీగా ఖర్చు కూడా చేస్తున్నాడు. రెండు భాషల్లో 100 కోట్ల కు పైగానే వసూళ్ళు రాబట్టిన సూపర్ హిట్ సినిమా పింక్ ని మళ్ళీ మన నేటివిటీకి తగ్గట్టు ..పవర్ స్టార్ ఇమేజ్ కి తగ్గట్టు మార్పులు చేర్పులు చేసి వకీల్ సాబ్ గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించబోతున్నారు. నివేదా థామస్, అనన్య నాగళ్ళ, అంజలి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఇక ఇన్నాళ్ళు లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన షూటింగ్స్ తిరిగి మొదలుపెట్టుకునేందుకు ముఖ్యమంత్రి అనుమతులు ఇచ్చారు. జూలై రెండవ వారం నుంచి అన్ని సినిమాల షూటింగ్స్ మొదలవబోతున్నాయి. దీంతో నిర్మాత దిల్ రాజు కూడా వకీల్ సాబ్ ని పూర్తి చేయాలనుకుంటున్నారు. కొన్ని కోర్ట్ లో చిత్రీకరించే కీలక సన్నివేశాలున్నాయి. అందుకోసం ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియో కోర్ట్ సెట్ ని నిర్మించారు.
ఇప్పటికే కొన్ని సీన్స్ ని పూర్తి కూడా చేశారు. ఇప్పుడు తిరిగి అక్కడే షూటింగ్ ప్రారంభించేందుకు దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు. అయితే రీసెంట్ గా ఇదే కోర్ట్ సెట్ లో చిత్రీకరించిన సన్నివేశం నుండి పవన్ కళ్యాణ్ లుక్ లీకై సంచలనం అయింది. ఇది దిల్ రాజుని బాగా కంగారు పెట్టేసిందట. ఆ లుక్ ఎలా లీకైందో తెలుసుకునేందుకు ట్రై చేస్తున్నాడట. ఇక ఈ విషయంలో యూనిట్ అందరికి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది.