హీరోలను మాస్ కోణంలో చూపించే సినిమాలు , తండ్రి, తల్లి మీద కొడుకులకు ఉన్న ప్రేమలతో సినిమాలు చేసిన డైరెక్టర్ పూరి జగన్నాథ్.. హీరో రామ్తో చేస్తున్న సినిమా `ఇస్మార్ట్ శంకర్`. `దిమాక్ డబుల్` అనేది క్యాప్షన్. ఆసక్తికరమైన విషయమేమంటే పూరి తనకు పరిచయం లేని జోనర్ సైన్స్ ఫిక్షన్లో `ఇస్మార్ట్ శంకర్` చిత్రాన్ని తెరకెక్కించారు. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. సినిమా గోవా షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేసేసుకుంది. ఈ విషయాన్ని యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఓ ఫోటోను కూడా షేర్ చేసింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్య్రక్రమాలను జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత దీనికి సీక్వెల్గా డబుల్ ఇస్మార్ట్
ను తెరకెక్కించబోతున్నామని పూరి, ఛార్మిలు ప్రకటించారు. ఏదైతేనేం పూరి ప్లాన్ ప్రకారం స్మార్ట్గా చిత్రీకరణను పూర్తి చేసేశాడు.
previous post