ఇటీవల ప్రభుత్వం సినిమా షూటింగ్స్ కి అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. గత 20 రోజులుగా ఈ విషయమై ఇండస్ట్రీ పెద్దలు ముఖ్యమంత్రి తో సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం చిత్ర పరిశ్రమకి కఠిన కరోనా నిబంధనలతో ఈ అనుమతులు లభించాయి. అయితే గత నెల నుంచే చిత్ర పరిశ్రమలోని మేకర్స్ కి సంకేతాలు అందుతుండటంతో తమ సినిమాలని సెట్స్ మీదకి తీసుకు వెళ్ళేందుకు ముందుగానే ప్రణాళికలు వేసుకున్నారు.
ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సినిమాలన్ని మళ్ళీ షూటింగ్ కి సన్నాహాలు చేసి పెట్టుకున్నారు. అయితే కరోనా విసృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో విదేశాలకి వెళ్ళే అవకాశమే లేదు. దాంతో అందరూ రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్స్ నిర్మించుకున్నారు. విదేశాలకి వెళ్ళి షూటింగ్ చేయాల్సిన భారీ సినిమాలన్ని ఇక్కడికే చేరుతున్నాయి. వాస్తవంగా ఎప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో తెలుగు తమిళం హిందీ సహా మిగతా భాషలన్ని కలిపి 7-8 సినిమాలు షూటింగ్ జరుపుకుంటుంటాయి.
కాని ఈ సారి ఈ సంఖ్య రెట్టింపు అయిందని తెలుస్తుంది. జూన్ 15 తర్వాత నుండి రామోజీ ఫిల్మ్ సిటీ షూటింగ్స్ తో కిక్కిరిసిపోతుందని అంటున్నారు. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ కోసం భారీ సెట్ ని నిర్మించారు. ఆ సెట్ లో రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ని మొదలు పెట్టబోతున్నాడట. అలాగే ప్రభాస్ రాధాకృష్ణ కుమార్ ల పాన్ ఇండియా సినిమా కూడా మొదలవబోతుందని సమాచారం. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో రూపొందబోయో పీరియాడికల్ మూవీ కోసం ఇప్పటికే క్రిష్ సెట్స్ తయారు చేయించారట. ఈ సినిమా కూడా ఫిల్మ్ సిటీలో షూటింగ్ స్టార్ట్ అవుతోంది. కొరటాల శివ మెగాస్టార్ ల ఆచార్య, సుకుమార్ అల్లు అర్జున్ ల పుష్ప, బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ BB3… ఇలా చాలా సినిమాలు ఒకేసారి ఫిల్మ్ సిటీలో షూటింగ్ కి సిద్దమవుతున్నాయట. ఇక మిగతా భాషల సినిమాలకి ఫిల్మ్ సిటీ లో షూటింగ్ కి అనుమతులున్నాయా ..లేదా తెలియాల్సి ఉంది. అయితే ఇంతమంది స్టార్ హీరోల సినిమాలు తన యూనిట్ తో షూటింగ్స్ ఒకేసారి మొదలు పెడితే ఎలాంటి సమస్యలు వస్తాయో అన్న టాక్ మొదలైంది.