Mukku Avinash: జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న ముక్కు అవినాష్ తరువాత బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొన్నారు. ఈ రియాలిటీ షో ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న అవినాష్ ప్రస్తుతం ఎన్నో కష్టాలలో ఉన్నట్లు తెలుస్తోంది. కష్టాల్లో ఉన్న అవినాష్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి ఆదుకుంది.అవినాష్ స్వస్థలం తెలంగాణలోని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం. ఐతే ఇటీవల అవినాష్ తల్లి లక్ష్మీరాజ్యం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రి పాలైంది. అయితే తన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం తన తల్లి వైద్య ఖర్చులకి ఖర్చు చేశాడు.అయినప్పటికీ తన తల్లి ఆరోగ్యం కుదటపడకపోవడంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.
అవినాష్ కి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉండటంతో అవినాష్ తన తల్లి వైద్య ఖర్చుల కోసం తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం ముక్కు అవినాష్ కు 60 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తూ తన తల్లి వైద్యం ఖర్చులకు సహాయం చేసింది. ఈ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి విడుదలైన ఆ డబ్బును చెక్కు రూపంలో శనివారం మంత్రి కొప్పుల ఈశ్వర్ అవినాష్ కు అందజేశారు.
మంత్రి కొప్పుల ఈశ్వర్, అవినాష్:
ఈ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ముక్కు అవినాష్ కు ఆర్థిక సహాయం అందడంతో ఈ చెక్కును ముక్కు అవినాష్ అందించినటువంటి ఫోటోను ఫేస్ బుక్ ద్వారా పోస్ట్ చేశారు. గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన కాళ్ల లక్ష్మీరాజ్యం గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 60 వేల రూపాయల చెక్కు మంజూరు కాగా ఈ రోజు క్యాంపు కార్యాలయంలో లక్ష్మీరాజ్యం కొడుకు అవినాష్ అందజేసినట్లు మంత్రి ఈశ్వర్ తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సదరు నెటిజన్లు ఈ విషయం పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు నెటిజన్లు ఎంతో మంది నిరుపేదలు సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నప్పుడు ఎలాంటి ఆర్థిక సహాయం చేయలేదు…కానీ ఈ విధంగా సెలబ్రిటీలు దరఖాస్తు చేసుకుంటే వారికి నిధులు మంజూరు చేయడం ఎంతో విడ్డూరంగా ఉందని కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం ముక్కు అవినాష్ ను సపోర్ట్ చేస్తూ, అతనికి నిజంగానే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటూ కామెంట్లు పెట్టడం గమనార్హం.