Aacharya: కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన “ఆచార్య” ఈ నెల 29వ తారీకు విడుదల కానున్న సంగతి తెలిసిందే. చిరంజీవి, చరణ్ కలసి లాంగ్ లెన్త్ రోల్ ఈ సినిమాలో చేయడంతో ఫ్యాన్స్ తండ్రి కొడుకులను ఒకే ఫ్రేమ్ లో చూడటానికి ఆరాటపడుతున్నారు. ఇప్పటికే సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్.. ట్రైలర్ లలో.. చరణ్, చిరంజీవి ఒకే ఫ్రేమ్ లో కనిపించిన సీన్స్.. అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మణిశర్మ అందించిన పాటలు కూడా హైలెట్ గా ఉన్నాయి. ఇక కొరటాల డైరెక్షన్ గురించి చెప్పనవసరం లేదు. ఇప్పటివరకు తీసినా సినిమాలలో ఒక్క పరాజయం కూడా లేదు. ఇంకా మొత్తం సెట్ అయిపోయింది. గ్యారెంటీరి హిట్ సినిమా తెర మీద పడటం మాత్రమే మిగిలి ఉంది అని అభిమానులు అంటున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దీంతో ఏప్రిల్ 29వ తారీకు కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇటువంటి తరుణంలో “ఆచార్య” సినిమా యూనిట్ కి జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విషయంలోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో “ఆచార్య” సినిమా కి టికెట్ రేట్ పెంచుకునే అవకాశాన్ని కల్పించింది. సినిమా నిర్మాణ వ్యయం వందకోట్లు దాటడంతో… పది రోజుల పాటు టికెట్ ధర పై 50 రూపాయలు పెంచుకునే అవకాశాన్ని కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
కానీ ఐదవ షోకి సంబంధించి మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. మరోపక్క తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే ముందుగానే “ఆచార్య” టికెట్ ధరలు పెంచుకోవటం మాత్రమే కాదు ఐదు షోలు వేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఏప్రిల్ 29వ తారీకు రెండు తెలుగు రాష్ట్రాలలో “ఆచార్య” భారీ ఎత్తున విడుదల అవుతుంది. దాదాపు 13 సంవత్సరాల తర్వాత చిరంజీవి సినిమాకి మణిశర్మ సంగీతం అందించడంతో పాటు చరణ్, చిరంజీవి కలిసి నటించడంతో సినిమా చూడటం కోసం సామాన్య సినీ ప్రేమికులు కూడా ఆతృతగా ఉన్నారు.