SVP: సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం “సర్కారు వారి పాట” మే 12వ తారీకు విడుదల కానున్న సంగతి తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాటలు, ట్రైలర్ సోషల్ మీడియాలో అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. ట్రైలర్లో మహేష్ చాలా అందంగా.. మాస్ నేపథ్యం కలిగిన హీరోగా కనిపిస్తున్నాడు. కచ్చితంగా “సర్కారు వారి పాట” కెరియర్ లో “పోకిరి” తరహా విజయం సాధిస్తుందని గతంలో మహేష్.. చెప్పిన కామెంట్లు నిజమవుతాయని ట్రైలర్ తర్వాత అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇక ఇదే సమయంలో ట్రైలర్ లో జగన్ 2019 ఎన్నికల ప్రచారంలో చెప్పిన నినాదం “నేను విన్నాను నేను ఉన్నాను”. నినాదాన్ని మహేష్ ఆయన శైలిలో “సర్కారు వారి పాట” లో పలకటంతో.. సినిమాకి ఇప్పుడు అదనపు ఆకర్షణ రావడం జరిగింది. సోషల్ మీడియాలో జగన్ అభిమానులు.. భారీ ఎత్తున సర్కారు వారి పాట లో జగన్ చెప్పిన డైలాగ్ మహేష్ చెప్పడాన్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు తాజాగా సర్కారు వారి పాట సినిమాకి టికెట్ల రేట్లు పెంపుకు జగన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విడుదలైన ఈ రోజు నుండి పది రోజుల పాటు టికెట్లపై 45 రూపాయల మేర పెంచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ తరహాలోనే గతంలో RRR, ఆచార్య సినిమా లకు కూడా జగన్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఈ క్రమంలో మహేష్ సినిమాకి కూడా టిక్కెట్లు పెంచే విధంగా బడ్జెట్ ప్రకారం.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో సర్కారు వారి పాట సినిమా నిర్మాతలు ఫుల్ హ్యాపీ గా ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్.