Jagapathi Babu : గత సంవత్సర కాలం నుంచి కరోనా మహమ్మారి ఎంతో మంది జీవితాలను మార్చింది. ఎంతో మందికి పనులు లేకుండా చేసిన ఈ కరోనా మరెంతో మందికి పనులను కూడా నేర్పించింది. ఈ వైరస్ కారణంగా ఎంతో మందికి ఉపాధి కోల్పోయి వీధిన పడ్డారు. ఈ విధంగా ఉపాధి కోల్పోయిన వారు సినిమా రంగంలో అత్యధికంగా ఉన్నారు.కరోనా తీవ్రత అధికంగా ఉండటం వల్ల సినిమా షూటింగ్ లను కేవలం కొంతమంది టెక్నీషియన్లను ఉపయోగించి మాత్రమే తెరకెక్కిస్తున్నారు. మరికొన్ని చోట్ల కరోనా పరీక్షలు చేయించుకుని నెగిటివ్ అని వచ్చినప్పుడు మాత్రమే షూటింగ్ కి అనుమతిస్తున్నారు.
ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది లేకపోవడంతో నటీనటులు వారి పనులను వారే చేసుకుంటూ ఉన్నారు. సినిమా అంటేనే ముఖ్యంగా ఉండాల్సింది మేకప్ మెన్. సినిమా ఇండస్ట్రీలో ఇతని పాత్ర ఎంతో ముఖ్యమైనది. అయితే ఈ కరోనా వల్ల కొందరు మేకప్ మెన్ లను పక్కన పెట్టాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే మేకప్ మెన్ లేకపోవడం వల్ల వారే సొంతంగా మేకప్ వేసుకుంటున్నారు.
జగపతిబాబు, మహాసముద్రం:
తాజాగా సీనియర్ హీరో జగపతిబాబు మేకప్ మెన్ గా మారిపోయాడు. కరోనా కారణం వల్ల తన మేకప్ మెన్ రాకపోవడంతో తానే స్వయంగా ముఖానికి మెరుగులు దిద్దుకున్నాడు. ఈ విధంగా జగపతిబాబు మేకప్ అవుతున్న సమయంలో తీసిన ఫోటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ కరోనాకు థాంక్స్. కరోనా వల్లే నేను మేకప్ మెన్ గా మారానని జగపతి బాబు పేర్కొన్నాడు. ఇక ప్రస్తుతం జగపతిబాబు శర్వానంద్ ,సిద్ధార్థ కలిసి నటిస్తున్న “మహా సముద్రం” సినిమాలో జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావాల్సి ఉండగా కరోనా జాగ్రత్తలు పాటిస్తూ కేవలం కొంతమంది టెక్నీషియన్ల మధ్య షూటింగ్ జరగడం వల్ల ఆలస్యం కావస్తోంది. మహా సముద్రం సినిమా ద్వారా సిద్ధార్థ్ తెలుగులో సందడి చేయనున్నారు. ఇక ఈ సినిమాలో అను ఇమ్మానియేల్, అదితి రావ్ హైదరి హీరోయిన్లుగా సందడి చేయనున్నారు. ఆర్ఎక్స్ 100 వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన అజయ్ భూపతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.