ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని “వారియర్” అనే సినిమా చేయడం తెలిసిందే. కృతి శెట్టి హీరోయిన్. సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రామ్ నటించడం జరిగింది. తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాకి డైరెక్టర్ లింగస్వామి. కాగా తాజాగా ఈ డైరెక్టర్ ఒక చెక్ బౌన్స్ కేసులో ఆరు నెలలు జైలు శిక్ష పడటం జరిగింది. పూర్తి విషయంలోకి వెళ్తే దర్శకుడు లింగస్వామి కి చెక్కు బౌన్స్ కేసులో న్యాయస్థానం ఆరు నెలలు జైలు శిక్ష విధించడం జరిగింది.
ఓ సినిమాని రూపొందించేందుకు పీవీపీ ఫైనాన్స్ కంపెనీ నుంచి కోటి 35 లక్షల రూపాయలను అప్పుగా తీసుకొని, నిర్మాతలైన తిరుపతి బ్రదర్స్ కి లింగు స్వామి ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత 35 లక్షల రూపాయలకు చెక్ ఇచ్చాడు. ఆ చెక్కు బౌన్స్ కావడంతో.. కోర్టులో కేసు వేయడంతో… న్యాయస్థానం ఆరు నెలలు జైలు శిక్ష విధించడంతోపాటు మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని తీర్పు ఇవ్వడం జరిగింది.
ఈ వార్త తమిళ సినిమా రంగంలో సంచలనం సృష్టిస్తుంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి మాస్ నేపథ్యం కలిగిన దర్శకుడిగా లింగు స్వామికి మంచి పేరు ఉంది. చాలామంది తమిళ టాప్ హీరోలు మాత్రమే కాదు తెలుగులో కూడా పలువురు స్టార్ హీరోలు ఈ డైరెక్టర్ తో పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లింగస్వామి తో సినిమా చేయడానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అదేవిధంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెడీగా ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇటువంటి తరుణంలో ఆయనకు జైలు శిక్ష పడటం దక్షిణాది ఫిలిం ఇండస్ట్రీలోనే సంచలనంగా మారింది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!