Janhvi Kapoor: దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సౌత్ ఫిలిమ్ ఇండస్ట్రీకి మంచి గిరాకీ ఏర్పడిన సమితి తెలిసిందే. అందులోనూ తెలుగు సినిమాల మార్కెట్ విపరీతంగా విస్తరించింది. బాహుబలి 2, RRR, పుష్ప విజయాలతో తెలుగు సినిమాలకి ప్రపంచ సినీ ప్రేక్షకులు ఎంతగానో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరోపక్క బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు సైతం దక్షిణాది సినిమాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. బాలీవుడ్ టాప్ హీరోలు దక్షిణాది దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. ఇంకా హీరోయిన్లు దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్ మరి కొంతమంది హీరోయిన్లు దక్షిణాది సినిమాలలో నటిస్తున్నారు.
ఇప్పుడు ఇదే తరహాలో దక్షిణాదిలో ఎంట్రీ ఇవ్వడానికి మెగా హీరోలతో దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బిగ్ ప్లాన్ వేయడం జరిగింది. మేటర్ లోకి వెళ్తే శ్రీదేవికి దక్షిణాది సినిమా రంగంలో విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సౌత్ ఇండస్ట్రీ ఎంట్రీ కి సంబంధించి ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది. అప్పట్లో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా సీక్వెల్ లో రామ్ చరణ్ సరసన..జాన్వీ కపూర్ హీరోయిన్ గా ప్రాజెక్టు మొదలు పెట్టనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ తర్వాత అవి వాస్తవం కాదని తేలింది.
పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు జాన్వీ కపూర్… మెగా హీరోలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో ఎంట్రీ ఇవ్వటానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే “పుష్ప 2″లో ఐటెం సాంగ్ లో …జాన్వీ కపూర్ నీ ప్లాన్ చేయటం జరిగిందట. ఇక చరణ్ మరియు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వస్తున్న సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ అని వార్తలు వస్తున్నాయి. ఈ తరహాలో పాన్ ఇండియా స్టార్ డామ్ ఉన్న మెగా హీరోలతో సౌత్ ఇండస్ట్రీలోకి ..జాన్వీ కపూర్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.