`దఢక్` సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి తనయ జాన్వీకపూర్.. ఇప్పుడు గుంజనా సక్సేనా జీవిత చరిత్రలో నటించడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా తర్వాత జాన్వీ రెండు పాత్రలున్న సినిమాలో నటించబోతుందట. అందులో ఓ పాత్ర దెయ్యం పాత్ర అని సమాచారం. రాజ్కుమార్ రావ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి దినేజ్ విజయ్, మృగ్ దీప్ నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారట. ట్రాప్డ్, క్వీన్ చిత్రాలకు రైటర్గా పనిచేసిన హార్దిక్ మెహతా ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం కాబోయే ఈ చిత్రానికి `రూహి అప్జా` అనే టైటిల్ను అనుకుంటున్నారట.
previous post
next post