Janhvi Kapoor: దివంగత శ్రీదేవి నట వారసురాలిగా జాన్వీ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఒకపక్క అవకాశాలు అందుకుంటున్న మరో పక్క సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంటూ ఉంది. ఇక ఇదే సమయంలో తల్లి శ్రీదేవిని ఎంతగానో ఆదరించిన దక్షిణాది సినిమాలకు దగ్గర అవడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ప్రస్తుతం దేశంలో దక్షిణాది సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడింది.
ఇందులో ముఖ్యంగా తెలుగు సినిమాలకు ఫుల్ క్రేజ్ క్రియేట్ అయింది. RRR, పుష్ప, బాహుబలి 2 వంటి సినిమాలు అనేక రికార్డులు క్రియేట్ చేయడం తెలిసిందే. బాలీవుడ్ లో కూడా అత్యధిక వసూలు రాబట్టయి. ఈ పరిణామంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన దర్శకులు తెలుగు టాలెంట్ నీ నమ్మకంతో సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇదే తరహాలో దివంగత శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ కూడా తెలుగులో సినిమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది.
ఇదిలా ఉంటే తన లేటెస్ట్ మూవీ “మీలి” ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ వచ్చిన జాన్వి కపూర్ … టాలీవుడ్ ఇండస్ట్రీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తెలుగులో సినిమాలు చేయడం తనకు ఇష్టం అనీ మనసులో మాట బయటపెట్టడం జరిగింది. తెలుగులో ఎన్టీఆర్ తన ఫేవరెట్ నటుడు అని చెప్పింది. ఇంకా విజయ్ దేవరకొండ ని చూస్తే యాంగ్రీ యంగ్ మ్యాన్ గుర్తుకు వస్తాడని పేర్కొంది. ఎన్టీఆర్ తో కలిసి పని చేయాలని తన డ్రీమ్ అని చెప్పుకొచ్చింది. జాన్వి కపూర్ లేటెస్ట్ మూవీ “మీలి” మలయాళం మూవీ “హెలెన్” కి రీమేక్ గా వస్తున్న సినిమా.