Jhanvi Kapoor: దివంగత అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. తల్లికి తగ్గ తనయురాలు మాదిరిలో ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కుర్రకారు హృదయాలను గెలుచుకున్న స్టార్ హీరోయిన్ గా వరుస అవకాశాలు అందుకుంటోంది. సోషల్ మీడియాలో సరికొత్త ఫోటోలతో పాటు విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న జాన్వి కపూర్ తాజాగా తన కొత్త సినిమా “గుడ్ లక్ జెర్రీ” సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన జాన్వి.. తన కాబోయే భర్తకు ఆరు లక్షణాలు ఉండాలి అని తెలియజేసింది. మొదటిది నేను చేసే ప్రతి పనిలో ఇష్టపడే టాలెంట్ ఉన్న వ్యక్తి భర్తగా రావాలని తెలిపింది. ఇక అందరినీ నవ్వించాలి, ఎక్కువ కామెడీ… చేయాలి. సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుండాలి. అంతమాత్రమే కాదు ఎప్పుడూ ఏదో ఒకటి ఉత్సాహంగా నేర్పిస్తూ… చాలా జాగ్రత్తగా చూసుకునే వ్యక్తి లైఫ్ పార్ట్నర్ గా రావాలని.. తెలిపింది. దీంతో జాన్వి కపూర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇదిలా ఉంటే ఇప్పటి వరకు బాలీవుడ్ సినిమాలను మాత్రమే చేసిన జాన్వీ కపూర్.. ప్రారంభంలో సౌత్ సినిమాలు అవకాశాలను వదిలేసుకుంది. అయితే ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ప్రకారం.. సౌత్ సినిమాలు కూడా ఇకనుండి చేయాలని డిసైడ్ అయినట్టు సమాచారం. దీనిలో భాగంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ “కేజిఎఫ్” డైరెక్టర్ ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో జాన్వీ కపూర్ నీ హీరోయిన్ అన్నట్టు వార్తలు వస్తున్నాయి. శ్రీదేవికి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ ఉంది. దీంతో జాహ్నవి కపూర్.. సౌత్ లో సినిమాలు చేస్తే తిరుగులేని క్రేజ్ ఉంటుందని సినిమా విశ్లేషకులు అంటున్నారు.